AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ.. రెండో స్థానానికే బీఆర్ఎస్ పరిమితం

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌ కంచుకోటను MIM దక్కించుకుంది.

Telangana: తెలంగాణలో అనూహ్య ఫలితాలు.. చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ.. రెండో స్థానానికే బీఆర్ఎస్ పరిమితం
Brs Bjp Congress
Balaraju Goud
|

Updated on: Jun 04, 2024 | 5:19 PM

Share

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌ కంచుకోటను MIM దక్కించుకుంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కడా ప్రభావం చూపకపోవడం గులాబీ శ్రేణులను నిరాశలోకి నెట్టేసింది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అందులో పెద్దపల్లి, జహీరాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఖమ్మం, నల్లగొండ అభ్యర్థులు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానాల ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌కు 40.5%, బీజేపీకి 34.5%, బీఆర్ఎస్‌కు 17.4% ఓట్ల శాతం దక్కినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

ఇక తెలంగాణలో కాషాయం పార్టీ గతంలో కన్నా మెరుగైన స్థానాలను సాధించేదిశగా ముందుకెళ్తోంది. 2019లో కేవలం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్‌, మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.

తెలంగాణ పార్లమెంట్‌ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ డబుల్ డిజిట్‌ సాధించాలన్న ప్రయత్నాలను.. మోదీ వేవ్‌తో కమలం పార్టీ దెబ్బకొట్టింది. అనూహ్యంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది బీజేపీ. గతంలో కేవలం సికింద్రాబాద్‌లో మాత్రమే గెలిచిన బీజేపీ, ఈసారి జంటనగరాలు, రంగారెడ్డిజిల్లాలో పట్టు నిలుపుకుంది. సికింద్రాబాద్‌ తోపాటు మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో గెలుపు దిశగా ముందుకెళ్తోంది బీజేపీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?