AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే భాగ్యనగరంలో అయోధ్య రామాలయం..

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న తరుణంలో దేశమంతటా ఆధ్యాత్మిక భావాలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా చరిత్రలోనే అపురూప ఘట్టంగా రామమందిర నమూనాను టీవీ9 ఆవిష్కరించింది. ఆరంభానికి ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందుంచింది.

Ayodhya: ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే భాగ్యనగరంలో అయోధ్య రామాలయం..
Ayodhya Ram Mandir
Srikar T
|

Updated on: Jan 15, 2024 | 10:06 AM

Share

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనున్న తరుణంలో దేశమంతటా ఆధ్యాత్మిక భావాలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా చరిత్రలోనే అపురూప ఘట్టంగా రామమందిర నమూనాను టీవీ9 ఆవిష్కరించింది. ఆరంభానికి ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందుంచింది. జనవరి 22న అయోధ్యలో దివ్య, భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీవీ9 మండల దీక్షలా 40 రోజులుగా శ్రీరాముడిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. రామభక్తి ధారలో ఓలలాడేలా కథనాలు అందిస్తూ ప్రేక్షకులను పరవశింప చేస్తోంది.

శ్రీరామ సప్తాహంలో భాగంగా అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్టకు ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరింపచేసింది టీవీ9. రామమందిర నమూనాను టీవీ9 తన స్టూడియోలో ఆవిష్కరించింది. నిపుణులు వ్యయప్రయాసలకోర్చి రామ మందిర రెప్లికాను రూపొందించి అద్భుతంగా తీర్చిదిద్దారు. టీవీ9 స్టూడియో మొత్తం రామమయమైంది. అణువణువునా రాముడు నిండిపోయాడు. సీతారామలక్ష్మణ హనుమంతులు టీవీ9 స్టూడియోలో కొలువు తీరారు. విశ్వహిందూ సమాజాన్ని ఏకం చేస్తున్న రాయాలయ ప్రారంభోత్సవ వేళ టీవీ9 కూడా రామభక్తిలో తన్మయత్వం పొందుతూ అయోధ్య హిందూత్వ రాజధాని పేరిట ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలతో కాంక్లేవ్‌ నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..