TSPSC: పేపర్ లీక్ కేసులో మిస్టరీగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ల వ్యవహారం.. ఆ చోరులు ఎవరు? తేల్చలేకపోతున్న సిట్..!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్లు జరుగుతున్నాయి. విచారణ కొనసాగుతోంది. కానీ ఒకే ఒక్క అంశంపై ఇప్పటి దాకా సిట్ అధికారులు ఏమీ తేల్చలేకపోయారు. అదే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వ్యవహారం. కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఈ వ్యవహారం ఎలా లీక్ అయింది? ఎవరు ఎవరి నుంచి దొంగిలించారు? అనేది ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించలేకపోయారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్ట్లు జరుగుతున్నాయి. విచారణ కొనసాగుతోంది. కానీ ఒకే ఒక్క అంశంపై ఇప్పటి దాకా సిట్ అధికారులు ఏమీ తేల్చలేకపోయారు. అదే యూజర్ ఐడీ, పాస్వర్డ్ వ్యవహారం. కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఈ వ్యవహారం ఎలా లీక్ అయింది? ఎవరు ఎవరి నుంచి దొంగిలించారు? అనేది ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించలేకపోయారు. ఈ మిస్టరీ వీడితే కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే ఇన్ని రోజులుగా విచారణ జరుగుతున్నా అధికారులు ఎందుకు తేల్చలేకపోతున్నారన్నది అంతుపట్టడం లేదు.
కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జ్గా శంకర్ లక్ష్మి ఉన్నారు. తనకు తెలియకుండా యూజర్ ఐడీ, పాస్వర్డ్లు ఎవరు కొట్టేశారు? ఎలా కొట్టేశారన్నది తేలాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా అధికారుల దీనిపై ఎటూ తేల్చలేకపోయారు. దీంతో శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. మొదట్లో శంకర్ లక్ష్మీ డైరీ నుంచి యూజర్ ఐడీ పాస్వర్డ్లు ప్రవీణ్ దొంగిలించాడనే ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ దీనిపై అధికారులు దృష్టి సారించినట్టు కనిపించలేదు. పేపర్ లీక్ కేసులో ఇప్పటిదాకా 37మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కానీ పాస్ వర్డ్ మిస్టరీ వీడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..