Telangana: యాసంగిలో వరిసాగు వద్దు.. సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ప్రకటన

Paddy Cultivation: యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవొద్దని కేంద్రం ప్రభుత్వం,

Telangana: యాసంగిలో వరిసాగు వద్దు.. సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ప్రకటన
Paddy
Follow us

|

Updated on: Nov 28, 2021 | 7:19 AM

Paddy Cultivation: యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిర్ణయించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగి వ‌రి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నాయ‌ని.. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వ‌రి సాగు చేయొద్దంటూ సూచించారు. శనివారం తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల శాఖ అధికారుల‌తో సీఎం సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయశాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, తదితర అంశాల‌పై అధికారులతో స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవ‌ద్దని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు. కావున రైతులు యాసంగిలో వ‌రి సాగు చేయొద్దంటూ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న రైతులు వ‌రిసాగు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షల మెట్రిక్ ట‌న్నుల బియ్యం మాత్రమే కొంటామ‌ని కేంద్రం చెప్పిందని.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జ‌రిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే.. అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్లు సమాచారం అందిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read:

Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..

T Congress: వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.. తెలంగాణ కాంగ్రెస్ రెండు రోజు వరి దీక్షలో నేతల డిమాండ్

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు