RIMS Hospital: కాలం చెల్లిన మందుల ఘటన.. రిమ్స్‌లో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..

Adilabad RIMS Hospital: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అలసత్వం

RIMS Hospital: కాలం చెల్లిన మందుల ఘటన.. రిమ్స్‌లో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్..
RIMS-Adilabad
Follow us

|

Updated on: Jun 29, 2021 | 10:03 AM

Adilabad RIMS Hospital: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిలో కాలం చెల్లిన ఇంజక్షన్లు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ముగ్గురు ఉద్యోగులపై వేటు పడింది. కాలం చెల్లిన ఇంజక్షన్లను రోగులకు ఇచ్చిన హెడ్ నర్స్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ విధుల నుంచి తొలగించారు. విదుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కాలం చెల్లిన మందులు రోగులకు ఇచ్చేందుకు ప్రయత్నించారని.. విచారణలో వెల్లడి కావడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు ఐదుగురు డాక్టర్లతో విచారణ కమిటీ వేసి.. పారదర్శకంగా విచారణ జరిపించి ఆ నివేదికలను జిల్లా కలెక్టర్, డి హెచ్‌లకు రిమ్స్ డైరక్టర్ సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహించిన హెడ్ నర్స్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల 14న ఆసుపత్రిలోని మూడో వార్డులో ఉన్న పేషెంట్లందరికీ వైద్య సిబ్బంది కాలం చెల్లిన ఇంజక్షన్లను ఇచ్చారని రోగుల బంధువులు ఆందోళనకు దిగారు. వార్డులో 12 మందికి జనవరితో గడువు ముగిసిన ఇంజక్షన్లను ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. రోగి బంధువు గుర్తించి వైద్య సిబ్బందికి చెప్పేంతవరకు విషయాన్ని గుర్తించకపోవడంతో రోగులు తీవ్ర అభ్యంతరాన్ని తెలిపారు. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Also Read:

India Covid-19: 102 రోజుల తర్వాత.. 40 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది మరణించారంటే..?

Traffic Challan: మొత్తం 131 చ‌లాన్లు.. ఫైన్ విలువ రూ. 36వేలు.. ఈ ఉల్లంఘ‌ల‌న్నీ ఒకే బైక్‌వీ..

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..