AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డిగ్రీ విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడు.. వైద్యం వికటించి యువతి మృతి

బాధిత యువతిని ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు..ఇదే గ్రామానికి చెందిన యువకుడు. ఆ తర్వాత ఆ యువతిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి.. అబార్షన్ చేయించాడు.

Telangana: డిగ్రీ విద్యార్థినిని గర్భవతిని చేసిన యువకుడు.. వైద్యం వికటించి యువతి మృతి
Medical Negligence
Jyothi Gadda
|

Updated on: Aug 19, 2022 | 12:11 PM

Share

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భద్రాచలంలోని సురక్ష ఆసుపత్రిలో ఓ యువతికి వైద్యులు అబార్షన్ చేశారు. అయితే, వైద్యం వికటించడంతో బాధిత యువతి మృతిచెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి కుటుంబసభ్యులు సురక్ష ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యువతి మృతికి కారణమైన యువకుడు,ఆస్పత్రి వైద్యులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, ఇక్కడ మరో దారుణం ఎంటంటే..ములకలపల్లి మండలం వి.కె రామవరం గ్రామానికి చెందిన బాధితురాలు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే బాధిత యువతిని ట్రాప్ చేసి గర్భవతిని చేశాడు..ఇదే గ్రామానికి చెందిన యువకుడు.

ఆ తర్వాత ఆ యువతిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి.. అబార్షన్ చేయించాడు. బాధితురాలు 5నెలల గర్భవతి కావటంతో వైద్యులు అబార్షన్ చేయడంతో వైద్యం వికటించింది.. ఆ విద్యార్థిని చనిపోయింది. యువతి మరణంతో గ్రామంలోనూ టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి