Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వామ్మో పులి.. యానిమల్ ఈటర్ నుంచి మ్యాన్ ఈటర్‌గా మారిన బెబ్బులి..!

నవంబర్ నెల నుండి మొదలవుతున్న పులి రక్త దాహం చలి‌కాలమంతా సాగుతుందడంతో అటు చలి నుండి ఇటు పులి నుండి కాపాడుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు గిరిజనులు.

Telangana: వామ్మో పులి.. యానిమల్ ఈటర్ నుంచి మ్యాన్ ఈటర్‌గా మారిన బెబ్బులి..!
Tiger
Follow us
Naresh Gollana

| Edited By: Balaraju Goud

Updated on: Nov 30, 2024 | 8:54 AM

అడవుల జిల్లా ఆదిలాబాద్ ప్రజలు నవంబర్ నెల పేరెత్తితేనే గజగజవణికిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగేళ్లుగా ఈనెల ఆ జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకటో రెండో ఊర్లను కాదు ఐదారు మండలాలనే గజగజ వణికిస్తోంది. పనులకు వెళ్లాలన్నా.. బడులకు వెళ్లాలన్నా భయంతో వణికిపోక తప్పడం లేదు. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! నవంబర్ వచ్చిదంటే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌ను చలి‌ వణికిస్తోంది. అయితే గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతాన్ని చలి మాత్రమే కాదు మృగరాజు పులి కూడా గజగజ వణికిస్తోంది. వణికించడం అంటే అలా ఇలా కాదు ఏకంగా ప్రాణాలే తీసేస్తోంది. పశువులు, మనుషులు అన్న తేడా లేదు.. రక్తం రుచి మరిగిన బెబ్బులి ఎదురు పడ్డ ప్రతి ప్రాణిని హతం చేస్తోంది. నక్కినక్కి పంజా విసిరి ప్రాణాలు తోడేస్తుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడాది కి ఒకరు అన్నట్టుగా నాలుగేళ్లలో పులి ఆకలికి నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇక్కడితోనే మ్యాన్ ఈటర్ ఆట ఆగిపోతుందన్న నమ్మకం లేదంటోంది కాగజ్ నగర్ కారిడార్ ప్రాంత జనం. 2020 నుండి మొదలైన పులుల దాడులు.. స్టిల్ కంటిన్యూ అన్నట్టుగానే సాగుతున్నాయి. కాగజ్ నగర్ కారిడార్ లోని దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన సిడం విఘ్నేశ్ (20 ) అనే యువకుడిని 2020 నవంబర్ 11 న పులి దాడి చేసి హతమార్చింది....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి