Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Governor Tamilisai: టీకానే మనకు ఆయుధం.. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్న గవర్నర్‌ తమిళిసై..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి గవర్నర్‌ తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.

Governor Tamilisai: టీకానే మనకు ఆయుధం.. గిరిజనులతో కలిసి వ్యాక్సిన్ వేసుకున్న గవర్నర్‌ తమిళిసై..
Tamilisai Soundararajan
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 12, 2021 | 2:37 PM

కోవిడ్ వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సిన్ వేసుకోవడమే మనకు ఆయుధం అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై అన్నారు. అందరూ టీకా తీసుకొని కరోనా నుంచి రక్షణ పొందాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కె.సి.తండాలో గిరిజనులతో కలిసి గవర్నర్‌ తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో గవర్నర్ మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ నమోదు తక్కువగా జరుగుతోందని తెలిసి వచ్చినట్లు వెల్లడించారు.

స్వదేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ తీసుకోగలగడం మనందరికీ గర్వకారణమని అన్నారు.  సొంత వ్యాక్సిన్‌తో ప్రపంచానికి, విమర్శకులకు ఆదర్శంగా నిలిచామని చెప్పుకొచ్చారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణలో, వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్‌ కేసీ తండాకు వచ్చి గిరిజనుల్లో వ్యాక్సిన్‌పై అవగాహన తీసుకురావడం అభినందనీయమని… గిరిజన మహిళల్లో టీకాపై ఉన్న భయాలను పోగొట్టేందుకు గవర్నర్ ఇక్కడికి వచ్చారని… స్ఫూర్తిగా తీసుకొని వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి : Rajinikanth Confirms: పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్.. మక్కళ్‌ మండ్రంను రద్దు చేస్తూ ప్రకటన..

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..