Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections 2024: ఎన్నికల ఎఫెక్ట్.. 3 రోజుల్లోనే సొంతూళ్లకు పయనమైన 1.42 కోట్ల జనాలు! ఆ రికార్డ్ బ్రేక్ చేసిన TSRTC

సార్వత్రిక ఎన్నికల వేళ ఓటేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జనాలు సొంతూళ్లకు పోటెత్తారు. ఈ సారి సంక్రాంతి రికార్డును టీఎస్‌ఆర్టీసీ బ్రేక్‌ చేసేసింది. సాధారణంగా ప్రతీయేట సంక్రాంతి సీజన్‌తో అత్యధికంగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. అయితే సంక్రాంతితో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నట్లు..

Elections 2024: ఎన్నికల ఎఫెక్ట్.. 3 రోజుల్లోనే సొంతూళ్లకు పయనమైన 1.42 కోట్ల జనాలు! ఆ రికార్డ్ బ్రేక్ చేసిన TSRTC
Telangana RTC Bus Services for Elections
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2024 | 7:03 AM

హైదరాబాద్‌, మే 13: సార్వత్రిక ఎన్నికల వేళ ఓటేసేందుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న జనాలు సొంతూళ్లకు పోటెత్తారు. ఈ సారి సంక్రాంతి రికార్డును టీఎస్‌ఆర్టీసీ బ్రేక్‌ చేసేసింది. సాధారణంగా ప్రతీయేట సంక్రాంతి సీజన్‌తో అత్యధికంగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటారు. అయితే సంక్రాంతితో పోలిస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దాదాపు 10 శాతానికి పైగా ప్రయాణికులు ఆర్టీసీని వినియోగించుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.

మే 9 నుంచి 11వ తేదీ వరకు సుమారు 1.42 కోట్ల మందికిపైగా ఆర్టీసీలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల ముందే రైల్వేలో అన్ని సీట్లు రిజర్వ్‌ కావడంతో అధిక మంది జనాలు బస్సు మార్గంలో ప్రయాణించేందుకు మొగ్గు చూపారు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపునకు ఇప్పటివరకు దాదాపు 590 స్పెషల్‌ బస్సులను టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ – విజయవాడ రూట్‌లోనే దాదాపు 140 సర్వీసులను ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం పెట్టింది. ఈ బస్సుల్లో దాదాపు 3 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉంచింది. తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కోరింది. హైదరాబాద్‌ నుంచి 1500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతుంది. జేబీఎస్‌, ఎంజీబీఎస్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సుల సర్వీసులు నడుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.