Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather: మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Weather: మండుటెండల్లో కూల్ న్యూస్.. ఈ ప్రాంతానికి వర్షసూచన.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2025 | 9:00 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్‌.. మార్చిలోనే కనిపిస్తుండటంతో.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్లు 43 డిగ్రీల మార్క్​ను దాటేశాయి.

ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోండి..

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి..రోజురోజుకు ఉష్ణోగ్రతలో తీవ్రత పెరిగిపోతోంది. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిలోలో 20, పార్వతీపురం మన్యంలో14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది..

నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణకు వర్ష సూచన..

దక్షిణ, ఆగ్నేయ గాలులు ప్రభావంతో తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో నేడు కూడా ఎండల ప్రభావం కొనసాగనుంది. ఈ రోజు గరిష్టంగా మెదక్, నిజామాబాద్ లో 40.1 డిగ్రీలు..కనిష్టంగా నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

నిన్న ఆదిలాబాద్-40, మెదక్- 40, నిజామాబాద్-39.6, భద్రాచలం- 38.8, మహబూబ్‌నగర్- 38.5, రామగుండంలో 38.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..