AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటన

తెలంగాణలోని మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో రికార్డు స్థాయి మొక్క జొన్న దిగుబడి నేపథ్యంలో నేటి నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలో 20 కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లు చేయనున్నట్టు ప్రకటించింది.

Telangana: రైతన్నలకు బిగ్‌ అలర్ట్.. ఆ పంట కొనుగోళ్లు, మద్దతు ధరపై ప్రభుత్వం ప్రకటన
PM Kisan
Anand T
|

Updated on: Mar 20, 2026 | 2:49 PM

Share

తెలంగాణలో మెుక్కజొన్న రైతులకు ఇదో బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇవాళ్టి (మార్చి 20) నుంచి రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు క్వింటాల్‌కు రూ. రూ.2,400 మద్దతు ధర అందించాలని మార్క్‌ఫెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అయితే తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,21,494 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 29.79 లక్షల టన్నుల మేర మొక్కజొన్న దిగుబడి రానుంది. అయితే ఇప్పటికే మార్కెట్‌లో చాలా వరకు మొక్కజొన్న స్టాక్ ఉండడంతో వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

అయితే రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో మొక్కజొన్న దిగుబడి రావడంలో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరుతూ ఈసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం మొత్తం దిగుబడిలో నుంచి 8 వేల క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ 8 వేల క్వింటాళ్ల కొనుగోళ్లకు గాను కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది.

అయితే వ్యాపారులు మాత్రం రైతుల నుంచి క్వింటాల్‌ మొక్కజొన్నను కేవలం రూ.1,600 నుంచి రూ.1,800కు మాత్రమే కొనుగోళు చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రకటించిన ఈ 8వేల క్వింటాళ్ల పరిమితి దాటితే.. మద్దతు ధరకు కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాదరస శివలింగ పూజ చేస్తే 48 రోజుల్లో కష్టాలు దూరం.. శివుడి అపార..
పాదరస శివలింగ పూజ చేస్తే 48 రోజుల్లో కష్టాలు దూరం.. శివుడి అపార..
సిక్సర్‌ను సింగిల్‌గా మార్చి బుడ్డోడికి షాకిచ్చిన విల్ జాక్స్..!
సిక్సర్‌ను సింగిల్‌గా మార్చి బుడ్డోడికి షాకిచ్చిన విల్ జాక్స్..!
దేశంలోనే విషాదకరమైన రైలు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్, ఈట్రైన్ కథేంటంటే
దేశంలోనే విషాదకరమైన రైలు క్యాన్సర్ ఎక్స్‌ప్రెస్, ఈట్రైన్ కథేంటంటే
సెంట్రల్ ఏసీ vs స్ప్లిట్ ఏసీ.. రెండింటిలో ఏది బెట్టర్‌..!
సెంట్రల్ ఏసీ vs స్ప్లిట్ ఏసీ.. రెండింటిలో ఏది బెట్టర్‌..!
ఏ టీవీ ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది..? మీ పవర్ బిల్లును..
ఏ టీవీ ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తుంది..? మీ పవర్ బిల్లును..
పర్సనల్‌ లోన్‌ vs క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌.. ఏది మంచిది?
పర్సనల్‌ లోన్‌ vs క్రెడిట్‌ కార్డ్‌ లోన్‌.. ఏది మంచిది?
పాతకాలపు మునక్కాయ రొట్టెలు ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ..
పాతకాలపు మునక్కాయ రొట్టెలు ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ..
35లోనే 50లా కనిపిస్తున్నారా? ఈ అలవాట్లే కారణం..!
35లోనే 50లా కనిపిస్తున్నారా? ఈ అలవాట్లే కారణం..!
వందే భారత్ స్లీపర్ రైలులో మహిళ తొలి ప్రయాణం.. వీడియో వైరల్‌..!
వందే భారత్ స్లీపర్ రైలులో మహిళ తొలి ప్రయాణం.. వీడియో వైరల్‌..!
'పర్ ఫెక్ట్ హస్బెండ్ కానీ, పర్‌ఫెక్ట్ వైఫ్ ఎవరూ ఉండరు'
'పర్ ఫెక్ట్ హస్బెండ్ కానీ, పర్‌ఫెక్ట్ వైఫ్ ఎవరూ ఉండరు'