AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: టపాసులను బ్యాన్ చేయండి.. తెలంగాణలో దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు

దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీపావళి పండుగలో టపాసులు పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది

Breaking: టపాసులను బ్యాన్ చేయండి.. తెలంగాణలో దీపావళి పండుగపై హైకోర్టు కీలక ఆదేశాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 12, 2020 | 8:48 PM

Share

Diwali festival Telangana: దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టపాసులను బ్యాన్ చేయాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీపావళి పండుగలో టపాసులు పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది ఇంద్ర ప్రకాష్‌ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా ఉన్నాయని, ఈ సమయంలో టపాసులు పేల్చడం వలన ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. వీటి వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని పిటిషనర్‌ తెలిపారు. (పదేళ్ల తరువాత బన్నీకి విలన్‌గా మరోసారి ఆ నటుడు..!)

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టపాసులు బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలని సూచించింది. టపాసులపై ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు కూడా బ్యాన్ చేసిందని, కోలకత్తాలోనూ బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందని న్యాయస్థానం గుర్తు చేసింది. (‘ఓం జై జగదీశ్‌ హరే’ పాట పాడిన ప్రముఖ అమెరికన్ సింగర్‌.. వీడియో రిలీజ్‌)

ఈ క్రమంలో తెలంగాణలో కూడా క్రాకర్లు బ్యాన్ చేయాలన్న తెలిపింది. అలాగే ఎవ్వరూ క్రాకర్లు అమ్మడం గానీ , కొనడం గాని చేయొద్దన్న హైకోర్టు సూచించింది. ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని, ప్రచార మాధ్యమాల ద్వారా టపాసులు కాల్చకుండా ప్రభుత్వం అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇక దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. (డ్రగ్స్ కేసు: ఆ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం)