AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరువు హత్య.. ఆ బాధితురాలికి రక్షణ కల్పించండి! పోలీసులకు హై కోర్టు ఆదేశం

జనవరిలో భర్త పరువు హత్యకు గురైన 21 ఏళ్ల యువతికి తెలంగాణ హైకోర్టు రక్షణ కల్పించాలని ఆదేశించింది. భర్త హత్య తర్వాత బెదిరింపులను ఎదుర్కొంటున్న ఆమె పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సరూర్‌నగర్ పోలీసులను ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించి, పోలీసుల చర్యలపై నివేదికను కోరింది.

పరువు హత్య.. ఆ బాధితురాలికి రక్షణ కల్పించండి! పోలీసులకు హై కోర్టు ఆదేశం
Telangana High Court
Vijay Saatha
| Edited By: |

Updated on: Jun 21, 2025 | 1:28 PM

Share

పరువు హత్య కేసులో భర్తను కోల్పోయిన 21 ఏళ్ల యువతికి రక్షణ కల్పించాలని హైకోర్టు సరూర్నగర్ పోలీసులను ఆదేశించింది. తన భర్త వడ్లకొండ కృష్ణను ఈ సంవత్సరం జనవరిలో సూర్యాపేటలో హత్యకు గురయ్యాడు. ఈ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్య తర్వాత బాధితురాలుని కూడా అనేకసార్లు చంపుతామని బెదిరింపులు వచ్చాయి. దీనిపై బాధిత యువతి తక్షణ రక్షణ కోరుతూ పోలీసులకు విన్నవించిందని, కానీ అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు బాధిత మహిళకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. న్యాయమూర్తి జె వినోద్ కుమార్, ఆమె తరఫున దాఖలైన పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత, ఆమె ప్రస్తుతం ఉన్న చిరునామాను ధృవీకరించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 29న సూర్యాపేట పోలీసులకు రాతపూర్వకంగా అభ్యర్థనను సమర్పించారు. కానీ రెండు నెలలు గడిచినా వారు ఎలాంటి స్పందన ఇవ్వలేకపోయారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. పిటిషనర్ న్యాయవాది వాదన ప్రకారం.. తన భర్త హత్య అయిన జనవరి 26 తరువాత నుంచి తాను నిరంతరంగా బెదిరింపులు ఎదుర్కొంటున్నానని పేర్కొంది.

ఇంత తీవ్ర విషయాన్ని పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే అంశంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సూర్యాపేట పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఇక ఆమె ప్రస్తుతం హైదరాబాదు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో నివసిస్తున్నందున, హైకోర్టు హోం శాఖ ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశిస్తూ, సరూర్‌నగర్ పోలీసులను ఆమెకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించింది. అంతేకాకుండా పోలీసుల చర్యలపై నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును జూన్ 23న తదుపరి విచారణకు ఉంచింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..