AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా షార్ట్ టైమ్ ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు....

Telangana: ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
btech students
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2021 | 9:00 PM

Share

ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా షార్ట్ టైమ్ ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు రెడీ అయ్యింది. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రవేటు కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే ఈ సర్వీసును వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం  షార్ట్ టైమ్ ఆన్లైన్ కోచింగ్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందాలని ఆమె ఆకాక్షించారు. నిపుణులైన  లెక్చరర్లతో ఈ ఆన్లైన్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు.  విద్యార్థులకు ఈ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, స్వల్ప సమయంలో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆన్లైన్ కోచింగ్ ను http://tscie.rankr.io లింక్ ద్వారా పొందవచ్చు. కాగా గత సంవత్సరం కూడా ఎంసెట్, నీట్, ఐఐటీలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ కోచింగ్ అందించింది తెలంగాణ సర్కార్.  స్వరాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన 20 వేల మంది విద్యార్థులు ఈ క్లాసులకు హాజరయ్యారయ్యారు. వీరిలో 2685 మంది విద్యార్థులు మంచి ర్యాంక్స్ సాధించారు. షార్ట్ టైమ్ ఆన్‌లైన్ క్లాసులు మంచి ఫలితాలు ఇస్తుండటంతో, విద్యార్థుల భవిత బాగుండాలని తెలంగాణ సర్కార్ వీటిని కొనసాగించాలని నిర్ణయించింది.

Also Read:ఏడేళ్ల బాలికపై లైంగికదాడి.. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన చిత్తూరు పోక్సో కోర్టు

అత్యాచారాలు చేసేవారిని అంతం చేయాలి.. ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన కామెంట్స్