Hyderabad: సాయి ధరమ్ తేజ్ ట్వీట్పై స్పందించిన తెలంగాణ డీజీపీ.. ఆ యూట్యూబర్పై కేసు నమోదు
ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్ ఆన్లైన్లో ఓ డిబేట్ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. వారి అసభ్య కామెంట్స్ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది...
సోషల్ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నోరు ఉంది కదా అని, ఇంటర్నెట్ అందుబాటులో ఉంది కదా అని నోటికొచ్చినట్లు వాగుతున్నారు. కనీసం మానవత్వాన్ని, చదువుకున్నామన్న విషయాన్ని కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ దారుణ ఘటన సోషల్ మీడియా వేదికగా జరిగిన విషయం తెలిసిందే.
ప్రణీత్ హనుమంతు అనే ఓ తెలుగు యూట్యూబర్ ఆన్లైన్లో ఓ డిబేట్ను చేపట్టాడు. ఇందులో కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కూతుళ్ల మధ్య సాగే ఓ వీడియోపై నోటికొచ్చినట్లు వాగారు. అసభ్య కామెంట్స్ చేసి, అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
ఈ వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్ అగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఙప్తి చేశారు తేజ్. సదరు వీడియోను పోస్ట్ చేస్తూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీనిపై ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీం మల్లు భట్టి విక్రమార్క సైతం స్పందించారు. . ఈ క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు సాయి తేజ్ కు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల భద్రత నిజానికి అత్యంత ప్రాధాన్యత అంశం అన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫమ్లలో పిల్లల ఫొటోలు, వీడియోలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
సాయితేజ్ పోస్ట్..
This is beyond gruesome, disgusting and scary. Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.
Child Safety is the need of the hour 🙏🏼
I sincerely request Hon’ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024
సీఎం రేవంత్ ట్వీట్…
Thank you for bringing to our notice this issue @IamSaiDharamTej garu.
Child safety is utmost priority for our Govt. Will look into this incident and take appropriate action. https://t.co/5fTG4ZiQYi
— Revanth Reddy (@revanth_anumula) July 7, 2024
అయితే ఈ సంఘటనపై తెలంగాణ పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసభ్యకరమైన రీతిలో సంభాషిన యూట్యూబర్పై వెంటనే కేసు నమోదు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ పోస్ట్ను రీ ట్వీట్ చేస్తూ తెలంగాణ డీజీపీ అధికారిక పేజీ నుంచి ఈ పోస్ట్ చేశారు. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేశారు. మరి పోలీసుల చర్యతో అయినా ఇలాంటి వికృతాలకు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.
తెలంగాణ డీజీపీ స్పందన..
Addressing the inappropriate comments on a child, an FIR has been filed with @TGCyberBureau, and strict actions will follow.
We are committed to protecting all citizens, especially children. Offenders misusing social media for humor will face justice, and our team @TelanganaCOPs… https://t.co/dlsAwvzwks
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 7, 2024
ఇదిలా ఉంటే ఇదే విషయమై మరో హీరో మంచి మనోజ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. వినోదం ముసుగులో ఇలాంటి దారుణాలు జారడం చాలా ప్రమాదకరమన్నారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఇన్ స్టా గ్రామ్ ద్వారా హనుమంతు అనే వ్యక్తిని సంప్రదించానని, కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. అయితే ఈరోజు అతనే పసిపిల్లలపై నీచమైన కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దయచేసి ఇలాంటి వారిని అసలు ఉపేక్షించవద్దని తెలుగు రాష్ట్రాల పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాన్న మనోజ్.. పి హనుమంతు.. అమ్మ తోడు.. నిన్ను వదిలిపెట్టను అంటూ ఘాటుగా స్పందించారు.
మంచు మనోజ్ పోస్ట్..
It’s appalling and intolerable to see individuals like @phanumantwo using social platforms to spread abuse and hate under the guise of humour. This behaviour is not only disgusting but also dangerous.
Over a year ago, I reached out to him through Instagram to support women… https://t.co/jQVlZEPqph
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) July 7, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..