AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వర్క్ ఫ్రమ్ హోమ్ లో సీఎం రేవంత్ రెడ్డి.. అదే దారిలో రాష్ట్ర మంత్రులు!

నిత్యం సందర్శకులతో కలకలలాడే సచివాయలం ఒక్కసారిగా బోసిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణ ప్రజలను కూడా నిర్ణీత వేళల్లో సచివాలయంలోనికి అనుమతిస్తున్న విషయం విధితమే. కానీ లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ వెలువరించడంతో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవ్వరూ సచివాలయానికి రావడం లేదు. దాంతో సందర్శకుల సంఖ్య గణనీయవంగా తగ్గిపోయింది.

Telangana: వర్క్ ఫ్రమ్ హోమ్ లో సీఎం రేవంత్ రెడ్డి.. అదే దారిలో రాష్ట్ర మంత్రులు!
Telangana Secretariat
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 21, 2024 | 5:34 PM

Share

నిత్యం సందర్శకులతో కలకలలాడే సచివాయలం ఒక్కసారిగా బోసిపోయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాధారణ ప్రజలను కూడా నిర్ణీత వేళల్లో సచివాలయంలోనికి అనుమతిస్తున్న విషయం విధితమే. కానీ లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ వెలువరించడంతో ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎవ్వరూ సచివాలయానికి రావడం లేదు. దాంతో సందర్శకుల సంఖ్య గణనీయవంగా తగ్గిపోయింది.

పీసీసీ అధ్యక్షుడు కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సచివాలయానికి రావద్దని ఆయన నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అలాగే, మంత్రులు కూడా సచివాలయానికి రావడం లేదు. మంత్రులు తమ తమ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన రోజూ వారీ వ్యవహారాలను తమ ఇళ్ల నుంచే పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు అందుబాటులో లేకపోవడంతో సాధారణ ప్రజలు, సందర్శకులు సచివాయలంలో కనిపించడం లేదు. సాధారణంగా సందర్శకులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సచివాలయంలోనికి అనుమతి ఉంటుంది. అయితే, మంత్రులను కలుసుకోడానికి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులకు ఆ నిబంధన వర్తించబోదు. కానీ ఎవరైనా మంత్రులను కలుసుకోడానికి ప్రత్యేక అనుమతి తీసుకుంటే సాధారణ వేళల్లోనూ మంత్రుల పేషీ నుంచి భద్రతా సిబ్బందికి సమాచారం వస్తుంది. అప్పుడే వారిని లోనికి అనుమతిస్తారు.

కాగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులను కలుసుకోడానికి యధావిధిగా అనుమతి ఉంది. అయినప్పటికీ ఎన్నికల కోడ్ పరిమితుల దృష్ట్యా అన్ని పనులు అవ్వడం లేదని భావించి ఎక్కువ మంది సందర్శకులు సచివాలయానికి రావడం మానేశారు. దీంతో సచివాలయానికి భారీగా రద్దీ తగ్గింది.

మరోవైపు, రాష్ట్రంలో నెలకొన్న ఆయా సమస్యలు, జరుగుతున్న పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఎప్పటికప్పుడు సచివాలయం కేంద్రంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే పగడ్బందిగా ఎన్నికల నిర్వహణకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?