AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana CM KCR in Warangal: వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల సీకింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన..

Telangana CM KCR in Warangal: వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం
Cm Kcr At Mgm
Ram Naramaneni
|

Updated on: May 21, 2021 | 2:47 PM

Share

రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలపై సీఎం కేసీఆర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల సీకింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆయన తాజాగా వరంగల్‌ ఎంజీఎంలో తనిఖీలు నిర్వహించారు. హ‌న్మ‌కొండ‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో హెలికాప్టర్‌ నుంచి దిగిన కేసీఆర్‌.. అక్కడి నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో ఎంజీఎంకు చేరుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో నేరుగా కరోనా వార్డుకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. పీపీఈ కిట్‌ లేకుండానే సీఎం కరోనా వార్డుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు కేసీఆర్‌. తానున్నాన‌ని వారికి భరోసా కల్పించారు. ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. వైద్యులను అభినందించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాల పరిశీలించారు.  పడకల వద్దకు వెళ్లి కరోనా రోగులతో మాట్లాడి.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

సంద‌ర్శ‌న అనంత‌రం ఎంజీఎం ఆస్పత్రి విస్తరణ, నూతన భవనంపై సీఎం సమీక్ష నిర్వ‌హించారు. ఎంజీఎంను సంద‌ర్శించిన త‌ర్వాత వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జైలును ప‌రిశీలించారు సీఎం కేసీఆర్‌.. కాకతీయ మెడికల్‌ కాలేజీని ఆనుకొని ఉన్న జైలును ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జైలును సందర్శించి, అధికారులతో సమీక్షించారు. జైలును శివారుకు తరలించే ఏర్పాట్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

Also Read:  వరంగల్‌ ఎంజీఎంను సందర్శించిన సీఎం కేసీఆర్‌.. కరోనా వార్డులో రోగులకు ధైర్యం చెప్పిన సీఎం

‘రెండు నిమిషాలాగితే చనిపోయే వాడినే.. ఈ లోగా మావాళ్లు కృష్ణపట్నం కరోనా మందు వేయడంతో బ్రతికున్నా’

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి