AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి.

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!
Prashant Kishor Kcr
Balaraju Goud
|

Updated on: Mar 19, 2022 | 2:38 PM

Share

CM KCR Emergency Meet: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులతో అత్యవసర సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న మంత్రులు హుటా హుటిన ఫాంహౌజ్‌కు చేరుకోవాలంటూ ప్రగతిభవన్ నుంచి మంత్రులకు ఫోన్లు వెళ్లాయి. దీంతో శనివారం ఉదయం పలువురు మంత్రులు ఫాంహౌస్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రటరీతో సహా పలువురు ఉన్నతాధికారులను కూడా సీఎంవో కార్యాలయం సమావేశానికి రావల్సిందిగా వర్తమానం పంపినట్లు సమాచారం. ఇటీవల ఫాంహౌజ్‌లో కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వ పథకాలు, ప్రజల స్పందనపై I-PAC టీం సర్వే చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి పీకే అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also….  Andhra Pradesh: నాటుసారా, కల్తీమద్యంపై టీడీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..