Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: మేం ఆ పని చేస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరు.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Telangana: బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్కమంత్రి, ఎమ్మెల్యే మిగలరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని, బీజేపీనే అధికారం చేపడుతుందని బండి జోస్యం చెప్పారు

Bandi Sanjay: మేం ఆ పని చేస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరు.. బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌
Bandi Sanjay
Follow us
Basha Shek

|

Updated on: Aug 14, 2022 | 3:04 PM

Telangana: బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్కమంత్రి, ఎమ్మెల్యే మిగలరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని, బీజేపీనే అధికారం చేపడుతుందని బండి జోస్యం చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు పోయాయని బండి దుమ్మెత్తిపోశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ విమర్శించలేదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని గుర్తు చేశారు. ఇక కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదని బండి ఎద్దేవా చేశారు.

రజాకార్ల పాలన వచ్చిందా?

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ బహిరంగంగా కాల్పులు జరపడంపై స్పందించిన సంజయ్‌ ఈ ఘటన చూస్తోంటే తెలంగాణలో మళ్ల రజాకార్ల పాలన వచ్చిందని పిస్తోందన్నారు. ‘మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్లీ వచ్చిందా అనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీతో టచ్ లో ఉన్నాడని నేనెప్పుడూ చెప్పలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా మంచి పొలిటికల్ లీడర్. దుబ్బాక ఉపెఎన్నికలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..