AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

కోకాపేట భూముల వేలంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. సర్కారు భూమిని హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది.. అక్కడే గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారంటూ ఫైర్ అయ్యారు.

Bandi Sanjay: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయ్.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2023 | 5:09 PM

Share

కోకాపేట భూముల వేలంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. సర్కారు భూమిని హెచ్ఎండీఏ గజానికి లక్ష పదివేలకు అమ్ముతుంది.. అక్కడే గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారంటూ ఫైర్ అయ్యారు. దీని కోసమే కేబినెట్ మీటింగ్ పెట్టి ఆమోదించుకుని ప్రజలకు తెలియకుండా దాచాలనుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్.. మీ పార్టీకి మాత్రం భూములెలా వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఎంపి సోయం బాపురావు కుమారుడి వివాహానికి‌ హాజరైన బండి సంజయ్‌.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాయాలయాలకు కారు చౌకగా స్థలాలు కొట్టేని.. బీఆర్ఎస్ తీరుపై ఎన్నికల్లో తేల్చుకుంటామంటూ బండి సంజయ్‌ సవాల్ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి‌దోచుకునేందుకు ఎన్నికలకు‌ సిద్దమవుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు ‌కలిసి పోటీ చేస్తాయని జోష్యం చెప్పారు. కోకాపేట భూములను అప్పన్నంగా దోచుకునేందుకు‌ సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని.. తక్కువ ధరకు కాజేయాలని కుట్రలు‌ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బోయినిపల్లిలో ఇదే తరహాలో 10 ఎకరాలకుపైగా స్థలాన్ని కొట్టేసిందని.. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉందని ఆరోపించారు‌.

ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన తరువాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందా చేస్తున్నారంటూ బండి ఆరోపించారు. కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ఆ స్థలంలో పేదలకు ఇండ్లు కట్టివ్వాలని.. లేనిపక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు లీడర్లు పార్టీని వీడుతున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, ఒక సెక్షన్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్