AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌..

SCR Special Trains: ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌..
Special Trains
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2021 | 8:10 AM

Share

SCR Special Trains: ప్రయాణికుల రద్దీని పరిగణలోకి తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌ 17, 24 తేదీల్లో స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వీక్లీ స్పెషల్‌ రైలు (08586) నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే నవంబర్‌ 16, 23 తేదీల్లో విశాఖపట్నం- సికింద్రాబాద్‌ మధ్యన ప్రత్యేక రైలు (08585) సర్వీసులను నడపనున్నారు. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనున్న రైలు తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు ఆ తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ నల్గొండ స్టేషన్‌లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

దీంతోపాటు 9 నుంచి 14 తేదీల్లో విశాఖ ఎల్టిటి స్పెషల్ ట్రైన్‌కు అదనంగా స్లీపర్ క్లాస్ భోగి, 11 నుంచి 16 వరకు ఎల్టిటి ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక స్లీపర్ క్లాస్ కోచ్ సమకూర్చనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నవంబర్‌ 18న నాందేడ్‌-బీదర్‌ మధ్యన ప్రత్యేక రైలు (07506), నవంబర్‌ 20న బీదర్‌ నుంచి నాందేడ్‌కు ప్రత్యేక రైలు(07507) నడుస్తుందని అధికారులు తెలిపారు. ఛత్‌పూజా ఉత్సవాలను పురస్కరించుకుని నవంబర్‌ 14న ధనపూర్‌-నుంచి ఎర్నాకుళం వరకు ప్రత్యేక రైలు (06044)ను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.

Also Read:

PM Modi: అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రధాని మోడీ.. ట్విట్టర్‌ తాజా నివేదికలో అమెరికన్ సింగర్, సచిన్..

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం