Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulse Polio Rescheduled : పల్స్ పోలియో నిర్వహణ తేదీని ఖరారు చేసిన కేంద్రం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం మళ్ళీ తేదీని ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిణను..

Pulse Polio Rescheduled : పల్స్ పోలియో నిర్వహణ తేదీని ఖరారు చేసిన కేంద్రం.. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
Follow us
Surya Kala

|

Updated on: Jan 14, 2021 | 6:15 PM

Pulse Polio Rescheduled :కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కారణంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసిన కేంద్రం మళ్ళీ తేదీని ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహిణను ఈ నెల 31 న చేపట్టనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 30 న ప్రారంభించనున్నారు. మర్నాడు దేశ వ్యాప్తంగా ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నారు.

అయితే ఈ నెల 17న పల్స్ పోలియో నిర్వహించాల్సి ఉంది. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నివారణ కు జనవరి 16 న దేశ వ్యాప్తంగా తొలి దశ కోవిడ్ టీకాను కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తాజా కేంద్రం మళ్ళీ నిర్వహణ కు తీసుకుంది.

Also Read: వేల సంవత్సరాల పూర్వమే ఋషులు మరకందించిన సంక్రాంతి ఆచారాలు, వైదిక రహస్యాలు