AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్‌కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత కేటీఆర్

గడిచిన ఏడేళ్లలో తెలంగాణకు 15 వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పడ్డాయని.. దాదాపు 2 లక్షల 20 వేల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.

Minister KTR: ఏడేళ్లలో రాష్ట్రంలో 15 వేల పరిశ్రమలు.. భవిష్యత్‌కు అనుగుణంగా సౌర, పవన విద్యుత్‌కు ప్రాధాన్యత కేటీఆర్
Minister Ktr
Balaraju Goud
|

Updated on: Jul 29, 2021 | 4:11 PM

Share

Premium energies Plant at Hyderabad E-City: గడిచిన ఏడేళ్లలో తెలంగాణకు 15 వేల పైచిలుకు పరిశ్రమలు ఏర్పడ్డాయని.. దాదాపు 2 లక్షల 20 వేల రూపాయల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర పరిశ్రమల, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైద‌రాబాద్ ఈ-సిటీలో సౌర ప‌రిక‌రాల ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్రారంభించింది. నగర శివారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో ఏర్పాటైన ప్రీమియ‌ర్ ఎన‌ర్జీస్ ప్లాంట్‌ను మంత్రులు కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పీవీ సెల్స్, మాడ్యూల్స్‌ను ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఉత్పత్తి చేస్తోంది. రూ. 483 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ ఏర్పాటు చేసింది. రెండేళ్లలో పెట్టుబ‌డుల‌ను రూ. 1200 కోట్లకు పెంచ‌నున్నట్లు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్ వెల్లడించింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పీవీ సెల్స్, మాడ్యూల్స్ ఉత్ప‌త్తిని ప్రారంభించినందుకు ప్రీమియ‌స్ ఎన‌ర్జీస్‌ను అభినందించారు. 18 నెల‌ల్లోనే సౌర ప‌రిక‌రాల ఉత్ప‌త్తి ప్లాంట్ ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా 700 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి క‌లుగుతోంది. ఉపాధి క‌ల్ప‌న ప్ర‌భుత్వం ముందున్న అతిపెద్ద స‌వాల్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సౌర‌, ప‌వ‌న విద్యుత్ ఉత్ప‌త్తికి పెద్ద‌పీట వేస్తున్నామ‌ని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు.

ప్ర‌భుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామ‌కం త్వరలోనే చేపడుతామన్నారు. ప్ర‌యివేటు రంగంలో పెట్టుబ‌డుల ద్వారా ఉపాధి అవ‌కాశాలు మెరుగవుతాయన్నారు. ఏడేళ్ల‌లో రాష్ర్టానికి 15 వేల‌కు పైగా ప‌రిశ్ర‌మ‌లు వచ్చాయన్న మంత్రి.. 80 శాతానికి పైగా ప‌రిశ్ర‌మ‌లు త‌మ కార్య‌క‌లాపాలు ప్రారంభించాయ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో ఆగస్టు 5వ తేదీన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపిన కేటీఆర్.. తద్వారా రావిర్యాల, మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంత ప్రజలకు నైపుణ్యంతో కూడిని వృత్తి విద్యా శిక్షణ ఇస్తామన్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు.

Follow Us
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
కాలేజీలో తోటి విద్యార్ధిని గన్‌తో కాల్చి చంపిన మరో విద్యార్ధి!
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు