AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: బెల్లంపల్లిలో ఘోరం.. భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. అటు చిత్తూరులో..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం‌ జరిగింది. పట్టణంలోని అశోక నగర్‌లో భార్య షాహీన్‌ను కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపాడు భర్త ఆసిఫ్. కుటుంబకలహాలతోనే భార్య షాహీన్‌ను..

Crime News: బెల్లంపల్లిలో ఘోరం.. భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. అటు చిత్తూరులో..
Bollempalli Wife Murder
Venkata Narayana
|

Updated on: Jul 29, 2021 | 6:49 PM

Share

Bellampalli wife Murder : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం‌ జరిగింది. పట్టణంలోని అశోక నగర్‌లో భార్య షాహీన్‌ను కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపాడు భర్త ఆసిఫ్. కుటుంబకలహాలతోనే భార్య షాహీన్‌ను భర్త ఆసిఫ్ చంపి ఉంటాడని బంధువుల ఆరోపిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, షాహీన్ భర్త ఆసిఫ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 18ఏళ్ల క్రితం అశోక్ నగర్‌కు చెందిన షాహీన్‌ను వివాహం చేసుకున్నాడు.

అయితే, దాదాపు నెల రోజులుగా ఆసిఫ్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఆసిఫ్ కు అనుమానాలు మొదలయ్యాయి. భార్యాభర్తల తగాదా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అయితే, పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అయినా నిలువెల్లా అనుమానంతో దహించిపోతోన్న ఆసిఫ్ ఇవాళ కొడుకుని పని ఉందంటూ బయటకి పంపించి, కూతురు స్నానం చేస్తుండగా, టీవీ సౌండ్ పెద్దగా పెట్టి భార్య షాహీన్ గొంతుకోసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.

అటు చిత్తూరు జిల్లాలో..

అటు, చిత్తూరు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న వాసుని అతని భార్యే చంపేసినట్టు తెలుస్తోంది. ప్రియుడి ప్రేమ కోసం భర్తనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. భర్త వాసును భార్య స్వప్నప్రియ గొంతు నులిమి హతమార్చినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే, చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన వాసు ఈనెల 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల క్రితం భర్త వాసు గుండెపోటుతో చనిపోయినట్లు స్వప్నప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కట్టుకున్న భర్తను భార్యయే ప్రియుడి కోసం గొంతునులిమి చంపిందని బంధువులు, స్థానికులు ఆరోపించారు.

భర్త వాసును భార్య స్వప్నప్రియే చంపేసి.. గుండెపోటుతో మృతి చెందాడని నాటకం ఆడుతోందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతి చెందిన వాసు మెడపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. దానికి తోడు పోస్టుమార్టం నివేదికలో కూడా వాసు మెడ ఎముకలు విరిగినట్లు స్పష్టమైంది. దాంతో భార్య స్వప్నప్రియపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం చిత్తూరు టూ టౌన్‌ పోలీసులు స్వప్నప్రియను అదుపులోకి తీసుకొని వాసు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. స్వప్నప్రియ భర్త వాసును హతమార్చడానికి ఎవరైనా సాయపడ్డారా…? లేక ఒంటరిగానే హతమార్చిందా..? హత్యకు కుట్రపన్నిందెవరు..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు గ్రామస్తులు, బంధువులు మాత్రం వివాహేతర సంబంధమే వాసు హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. స్వప్నప్రియ, ఆమె ప్రియుడు కలిసే ఈ దారుణహత్యకు పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. మొత్తానికి 10 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్వప్నప్రియ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Read also : BJP : కూల్చివేతల్లో ఎంఐఎం ప్రాంతాలైన చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్లకు మినహాయింపులు దుర్మార్గం : బండి సంజయ్