Telangana: మళ్లీ మొదలైన కెఎ.పాల్ హడావుడి.. తెలంగాణలో పాదయాత్రకు రెడీ.. ఎప్పటినుంచి అంటే..

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎ.పాల్ తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. తయ పార్టీ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని, మునుగోడు ఎన్నికల్లో..

Telangana: మళ్లీ మొదలైన కెఎ.పాల్ హడావుడి.. తెలంగాణలో పాదయాత్రకు రెడీ.. ఎప్పటినుంచి అంటే..
Ka Paul
Follow us

|

Updated on: Dec 03, 2022 | 7:20 AM

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కెఎ.పాల్ తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. తయ పార్టీ సత్తా మునుగోడు ఎన్నికలలో ప్రజలు చూశారని, మునుగోడు ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు దిగజారాయని విమర్శించారు. ఈవీఎంలు మార్చి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాలుగోసారి గెలవబోతుందని కెఎ.పాల్ జోస్యం చెప్పారు. ఈవీఎం లు మనకు వద్దని, అమెరికా మాదిరిగా బ్యాలెట్ పేపర్ లు కావాలని కోరుకుందామని చెప్పారు. డిసెంబర్ 13న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులతో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని కేఏ పాల్ తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు ను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ముప్పై రోజులు అయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని, ఊరేగింపులకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. తెలంగాణ బిడ్డలారా అవినీతి పరులను మీరు నమ్ముతారా… ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారా అని పాల్ ప్రశ్నించారు.

తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని పాల్ వ్యాఖ్యానించారు. ఈడీ రైడ్స్ ద్వారా టీఆర్ఎస్ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు పట్టుబడటం మనం చూస్తున్నామని చెప్పారు. వందల కోట్ల రూపాయలతో బీజేపీవారు ఎమ్మెల్యే లను కొనడం కూడా మనం చూస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికలే లాస్ట్ ఎన్నికలని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కావాలా…మార్పు కోరుకుంటున్నారా… అని ప్రజలను అడిగారు కెఎ.పాల్.

కేసీఆర్ రూ.5 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్ కు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవన్నారు. వైఎస్. షర్మిల గురించి మాట్లాడుతూ.. తన అన్న జగన్ నాలుగేళ్ళ లో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొని వచ్చారని తెలిపారు. జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేదన్నారు కేఏ పాల్.తాను ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని కెఎ.పాల్ కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.