AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Robbery: సింకింద్రాబాద్ ‘బంగారం చోరీ’ దొంగలు ఆ రాష్ట్రానికి పరార్‌..! రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..

సికింద్రాబాద్‌ బంగారం చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడినవారిని మహారాష్ట్ర గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు...

Gold Robbery: సింకింద్రాబాద్ ‘బంగారం చోరీ’ దొంగలు ఆ రాష్ట్రానికి పరార్‌..! రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
Gold Robbery
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 29, 2023 | 7:46 AM

Share

ఐటీ అధికారుల ముసుగులో సికింద్రాబాద్ మార్కెట్‌ పీఎస్ పరిధిలోని జ్యూవెలరీషాపులో జరిగిన చోరీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మోండా మార్కెట్‌లోని మధుకర్ అనే వ్యాపారికి చెందిన షాపులో ఐటీ అధికారులమని నమ్మించి 1700 గ్రాముల బంగారంతో ముఠా ఉడాయించింది. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పాటు టాస్క్​ఫోర్స్ పోలీసులు కూడా గాలిస్తున్నారు. నిందితులు మహారాష్ట్ర గ్యాంగ్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. వారిని పట్టుకునేందుకు కొన్ని బృందాలు మహారాష్ట్రకు వెళ్లాయి.

అంతకముందు నిందితులు చోరీ తర్వాత ఆటోలో జేబీఎస్‌ వెళ్లిన ముఠా అక్కడి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. పటాన్‌చెరు మీదుగా మహారాష్ట్ర వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన చోట వందల జ్యూవెలరీ దుకాణాలు ఉండగా..నాలుగో అంతస్తులోని మధుకర్​నగలషాపుకే వెళ్లడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో షాపు యాజమాని మధుకర్ తన సొంతూరు షోలాపూర్‌లో ఉన్నాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని హైదరాబాద్‌కు పిలిపించి విచారిస్తున్నారు. గతంలో అక్కడ పని చేసిన వర్కర్ల వివరాలను సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే బంగారం చోరీ చేశారని పోలీసులు చెబుతున్నారు.

మోండా మార్కెట్‌లో ఉన్న బంగారం దుకాణానికి ఐదుగురు వ్యక్తులు సూటు బూటు ధరించి వచ్చి ఆఫీసర్లలాగా కటింగ్​ ఇస్తూ.. గోల్డ్​ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ షాపులోని సిబ్బందిని బెదిరించారు. షాపులో అటూ ఇటూ తిరుగుతూ హడివుడి చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిని పక్కకి వెళ్లగొట్టారు. అనంతరం షాపులో ఉన్న గోల్గ్‌ని పరిశీలిస్తూ.. సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ.. 1.7కిలోల బంగారానికి సంబంధించి ట్యాక్స్ కట్టలేదని..అందుకే ఆ గోల్డ్​ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. నోటీసులు ఇవ్వకుండానే బంగారంతో ఉడాయించారు. సిబ్బందిని షాపులోనే ఉంచి తలుపులు వేసి వెళ్లారు. ఈ ఘటనతో ఖంగుతిన్న సిబ్బంది తమ యాజమాని మధుకర్‌కి తెలపడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే వచ్చింది నకిలీ ఐటీ అధికారులని గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!