Telangana: ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రుల సంఘం ఈ పిటిషన్ వేసింది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తల్లిదండ్రుల సంఘం ఈ పిటిషన్ వేసింది. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించొద్దని పిటిషనర్ పేర్కొన్నారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలన్న పిటిషనర్ కోరారు. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారులతో మంత్రి సబిత టెలీకాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ హాల్ టికెట్లు నేటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. వెబ్ సైట్లో అప్లోడ్ చేశామని.. నేటి సాయంత్రం 5 గంటల నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 25 నుంచి నవంబరు 3 వరకు ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టికెట్లో వివరాలు తప్పు ఉంటే కాలేజ్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. హాల్ టికెట్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఎగ్జామ్కు అనుమతి ఇవ్వాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు.
Also Read: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్ను కలిసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్