Telangana: స్టూడెంట్స్ ఫుల్.. టీచర్స్ నిల్.. స్కూల్ కి తాళం వేసిన పిల్లల పేరెంట్స్.. ఎక్కడంటే

చాలా ప్రభుత్వ పాఠశాలల్లో తగిన సంఖ్యలో విద్యార్థులు ఉండడం లేదన్న సంగతి తెలిసిందే.. అయితే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లోని పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. అక్కడ స్కూల్స్ లో స్టూడెంట్స్ సంఖ్య అధిగంగా ఉంది.

Telangana: స్టూడెంట్స్ ఫుల్.. టీచర్స్ నిల్.. స్కూల్ కి తాళం వేసిన పిల్లల పేరెంట్స్.. ఎక్కడంటే
Parents Locked School
Follow us

|

Updated on: Jun 22, 2022 | 5:17 PM

Telangana: తెలంగాణాలో స్కూల్స్ రీ ఓపెన్ (Schools Re Open) అయ్యాయి. కరోనా(Corona) నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. పాఠశాలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం ప్రయివేట్ స్కూల్స్ లో చేర్పించడానికి ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో తగిన సంఖ్యలో విద్యార్థులు ఉండడం లేదన్న సంగతి తెలిసిందే.. అయితే రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల్లోని పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. అక్కడ స్కూల్స్ లో స్టూడెంట్స్ సంఖ్య అధిగంగా ఉంది. అయితే స్టూడెంట్స్ కు తగిన సంఖ్యలో చదువు చెప్పే ఉపాధ్యాయులు మాత్రం లేరు.. దీంతో స్టూడెంట్స్ తల్లిదండ్రులు టీచింగ్ స్టాఫ్ కొరతను నిరసిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు.. స్కూల్స్ కు తాళం వేశారు. అంతేకాదు.. ఉపాధ్యాయులను నియమించే వరకూ స్కూల్స్ వేసిన తాళాలు తీసేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ ఘటన పలు గ్రామాల్లో చోటు చేసుకోటం విశేషం..

అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 140 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇక్కడ స్కూల్ లో చదువు చెప్పేందుకు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. దీంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాఠశాలకు తాళం వేశారు. ఓ వైపు స్టూడెంట్స్ లేక చాలా పాఠశాలలు క్లోజ్ అవుతుంటే.. తమ గ్రామంలో స్టూడెంట్స్ ఉన్నా.. టీచర్స్ లేక మూతబడుతున్నదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు తమ గ్రామంలోని స్కూల్ కు తక్షణమే టీచర్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ వేసిన తాళం తీయమని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి