Humanity: ఆస్తి కాజేసి అత్తను రోడ్డు పాలు చేసిన కోడలు.. 4 రోజులుగా చెట్ల కింద వృద్ధురాలు

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న థీరీని నేటి మనిషి బాగా అమలు చేస్తున్నాడు.. చివరికి కని పెంచినవారిని సైతం పిల్లలు కనికరించడం లేదు. ఉన్న ఆస్తిని కాజేసి ఓ అత్తను రోడ్డు పాలు చేసింది ఓ కోడలు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) నాంపల్లి మండలం (Nampalli Mandal) వడ్డెపల్లిలో జరిగింది.

Humanity: ఆస్తి కాజేసి అత్తను రోడ్డు పాలు చేసిన కోడలు.. 4 రోజులుగా చెట్ల కింద వృద్ధురాలు
Mother In Law Protest
Follow us

|

Updated on: Jun 22, 2022 | 2:37 PM

Humanity: అనుబంధం ఆప్యాతయ అంతా భూటకం.. మనుషులు ఆత్మతృప్తికై ఆడుకునే నాకటం అన్న సినీ కవి మాటలను నేడు నిజం చేస్తున్నారు చాలామంది జనం.. రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. రక్తబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. ఆస్తి పాస్తుల ముందు అనుబంధాలు, ఆత్మీయతల తావు లేకుండాపోయింది. చివరికి కని పెంచినవారిని సైతం పిల్లలు కనికరించడం లేదు. ఉన్న ఆస్తిని కాజేసి ఓ అత్తను రోడ్డు పాలు చేసింది ఓ కోడలు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా (Nalgonda District) నాంపల్లి మండలం (Nampalli Mandal) వడ్డెపల్లిలో జరిగింది.

వడ్డెపల్లికి చెందిన సూదనబోయిన బుగ్గమ్మకు కుమారుడు, కుమార్తె సంతానం. ఈమె భర్త నర్సింహ 30 ఏళ్ల క్రితమే మృతి చెందారు. కుమార్తె వివాహం జరిపించిన అనంతరం అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి బుగ్గమ్మ ఒంటరి మహిళగా బతుకీడుస్తూనే ఉన్న ఒక్కగానొక్క కొడుకు జంగయ్య కోసం కష్టపడి ఏడెకరాల భూమి, ఇంటి స్థలం సంపాదించింది. కొడుకును పెద్దచేసి వివాహం జరిపించింది. కుమారుడి పేరున భూమి ఉండాలని ఒక ఎకరం 20 గంటల భూమి అతని పేరున రిజిస్ట్రేషన్‌ చేసింది. అతడికి ఇద్దరు కుమార్తెలు కాగా మనురాళ్లకు పెళ్లిళ్లు చేసి, వారి పేరున రెండెకరాల చొప్పున భూమి పట్టా చేసింది. ఎనిమిది నెలల క్రితం పశువులు కాసేందుకు వెళ్లిన కుమారుడు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. అదే సమయంలో బుగ్గమ్మ ఎడమ కాలుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో ఐదు నెలల క్రితం వైద్యులు ఆమె కాలు తొలగించారు.

కొడుకు మరణానంతరం అతని పేరున ఉన్న భూమిని కోడలు లక్ష్మమ్మ తన పేరున మార్చుకోవాలని నిర్ణయించుకుంది. పట్టా మార్పిడి కోసం సాక్షి సంతకం కావాలంటూ బుగ్గమ్మను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కొడుకు భూమితో పాటు తనకు తెలియకుండానే తన పేరు మీద ఉన్న భూమిని ఆమె పేరుపై మార్చుకున్నట్లు బుగ్గమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి తనకు తిండి పెట్టకుండా వేధిస్తున్నట్లు ఈ నెల 17న నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బుగ్గమ్మ. నాలుగు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ చెట్ల కింద ఉంటూ.. పండ్లు తింటూ కడుపు నింపుకుంటోంది. పస్తులుండి ఆస్తులు కూడబెట్టిన తనను అనాథను చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్‌కు సమస్యను వివరించి, అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..