తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ.. జీరో ఫోబియా.. ఏ పార్టీలకు..?
మొదటి నుంచీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ, డెవలప్మెంట్ సబ్జెక్ట్లో భిన్నాభిప్రాయాలుంటే ఉండొచ్చు. పొలిటికల్గా మాత్రం తెలంగాణ రైజింగే..! దీంతో టాప్గేర్లోకి వచ్చాయి మూడు పార్టీలు. ఎవరి బ్యాటింగ్ వాళ్లు ఆడుతూ, స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నారు. మూడు పార్టీల మధ్య ఒక నంబర్గేమ్ కూడా మొదలైంది. దంగల్ 2028.. కాదు.. కాదు.. తెలంగాణ దంగల్ 2029కి సెమీఫైనల్స్ షురూ అయ్యింది. డీటెయిల్డ్గా చూద్దాం..

ఒకటి గమనించారా? నాటకీయమా, యాదృచ్ఛికమా, కాకతాళీయమా.. ఏదైతేనేం.. ఢిల్లీలో ఒక చిన్నసైజు అద్భుతమైతే జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ ఒకేసారి ఢిల్లీలోనే మకాం పెట్టారు. పైగా, ఇద్దరూ అభివృద్ధే తమ ఎజెండా అని ఒట్టేసి చెప్పుకున్నారు. రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీని కలిసి రీజినల్ రింగురోడ్డుపై అప్డేట్ తీసుకుని, విమానాల మంత్రి రామ్మోహన్ని కలిసి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులపై క్లారిటీ అడిగి, తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి జల పంచాయతీలు చేశారు సీఎం రేవంత్. అదే టైమ్లో అదే ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తన రూటూ డెవలప్మెంటే అన్నారు. ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్ CCIని పునరుద్ధరించాలని కోరారు. తెరిపించేదాకా నిద్రపోనన్నారు. పని ముఖ్యం-ఆ తర్వాతే పాలిటిక్స్ అని రేవంత్ అండ్ కేటీఆర్ ఇద్దరూ గతంలో ప్రామిస్ చేసినవాళ్లే. కానీ, ఈ పని వెనుక ఆ పాలిటిక్స్ కూడా ఉన్నట్టేనా? ఢిల్లీ టూర్ల బ్యాక్డ్రాప్లో గల్లీ ప్రయోజనాలేమైనా ఉన్నాయా? అంటే.. అవుననే అంటోంది ఎనలిస్టుల వాయిస్. తెలంగాణలో సెమీఫైనల్స్ షురూ ఐనట్టేనట..! అవును, రెండేళ్లకు ముందే తెలంగాణ దంగల్కి దండోరా మోగింది. కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ.. మూడూ పార్టీలూ పెర్ఫామెన్స్లు రీచెక్ చేసుకుంటూ, ఎవరికి వాళ్లు సిబిల్ స్కోర్లు సరిచూసుకుంటున్నారు. సొంత సర్వేలు చేయించుకుంటున్నారు. అందులో కొన్ని ఇంటర్నల్ సర్వేలు, కొన్ని ఎక్స్టర్నల్ సర్వేలు. తమకు అనుకూలమైన నంబర్లు వచ్చేదాకా సర్వేలు ఆపేదే...
