AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కన్న తల్లిపై దాడి.. రోకలి బండ తలపై కొట్టి.. ఆఖరుకు

సెల్ ఫోన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. వాటి మైకంలో పడి చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోని వారు ఎందరో.. అయితే కరోనా కారణంగా ఆన్లైన్ పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్(Smart Phone) కు అలవాటయ్యారు....

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని కన్న తల్లిపై దాడి.. రోకలి బండ తలపై కొట్టి.. ఆఖరుకు
Chennai Murder
Ganesh Mudavath
|

Updated on: Mar 26, 2022 | 1:08 PM

Share

సెల్ ఫోన్లు నిత్య జీవితంలో భాగమయ్యాయి. వాటి మైకంలో పడి చుట్టూ జరుగుతున్న వాటిని పట్టించుకోని వారు ఎందరో.. అయితే కరోనా కారణంగా ఆన్లైన్ పుణ్యమా అని ఇప్పుడు చిన్నపిల్లలూ స్మార్ట్ ఫోన్(Smart Phone) కు అలవాటయ్యారు. అయితే సెల్ ఫోన్ కొనివ్వాలంటూ ఓ యువకుడు తన తల్లిని దారుణంగా హత్య(Murder) చేశాడు. రోకలితో తలపై కొట్టి మరీ అంతమొందించాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి(Undavalli) మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేశాడు. అప్పుడప్పుడు తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిని కోరాడు. డబ్బులు లేవని, తర్వాత కొనిస్తానని తల్లి చెప్పింది. అయినా మహేశ్ ప్రవర్తన మార్చుకోలేదు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఈ విషయంపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంతో రోకలిబండతో తల్లి తలపై కొట్టాడు. ఆమె తీవ్రగాయాలపాలై కింద పడిపోయింది.

విషయం తెలుసుకున్న స్థానికులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేటప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇటీవల లక్ష్మి మరో కుమారుడు సాల్మన్‌ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని గాయపరిచాడు. ఈ ఘటనలో అతను జైలుకూ వెళ్లాడు. తమ్ముడిని జైలుకు పంపించిన వారిపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. మూడు రోజుల క్రితం రైతులు పొలాల్లో మిరప కట్టెకు నిప్పు పెట్టాడు. ఆ సమయంలో అందులోకి దూకడంతో చేతులకు గాయాలయ్యాయి. కుమారుడి గాయాలకు మందు పూసేందుకే లక్ష్మి కూలి పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉందని, ఇదే సమయంలో సెల్ ఫోన్ విషయంలో ఘర్షణ జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.

Also Read

MODI STORY: ఛాయ్‌వాలా నుంచి ప్రధాని దాకా మోడీ ప్రస్థానం.. పోర్టల్ ప్రారంభించిన మహాత్మా గాంధీ మనవరాలు

Hyderabad: తవ్వకాల్లో బయటపడిన పురాతన అమ్మవారి విగ్రహం.. అదృష్టం అంటూ భక్తులు ప్రత్యేక పూజలు

Hridayam Remake: ‘హృదయం’పై మనసుపారేసుకున్న బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యుసర్‌.. తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో..

ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
ఆన్‌లైన్‌లో ఆఫర్లు చూసి హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకుంటున్నారా..?
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
'రాహుల్ గాంధీకి ఎన్నికల వ్వవస్థపై అవగాహన లేదు'
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
కల్యాణ్ మా కులపోడే.. కన్నడ అమ్మాయి బిగ్ బాస్ కప్పు కొట్టకూడదు..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
మీరు వాడే నెయ్యి స్వచ్ఛతపై అనుమానం ఉందా.? ఇలా చెయ్యండి..
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
అద్దె కోసమని వచ్చారు.. ఆ తర్వాతే అసలు పని కానిచ్చారు
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
75 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐక్యతకు నిదర్శనం ఈ చర్చి..ధ్వజ స్తంభం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారా.? ఉదయపూర్‎లో ఈ ప్రదేశాలు మహాద్భుతం..
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
ఫస్ట్ సెట్‌లో ఆరుగురు.. లిస్ట్‌లో రూ. 17 కోట్ల ప్లేయర్
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
రూ.12 వేలకే మతిపోయే ఫోన్.. ఫీచర్లు చూస్తే వామ్మో అంటారు
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..
శీతాకాలం స్పెషల్.. రాజస్థాన్‎లో ఈ ప్లేసులు సూపర్.. వెళ్లారంటే..