AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేవంత్ రెడ్డి భూకబ్జాలు, అక్రమాలను చూస్తూ ఊరుకోం..

రేవంత్ రెడ్డి భూఅక్రమణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఓ బాధ్యతాయుతమైన ఎంపీగా పదవిలో ఉండి.. దళితుల భూములను కబ్జా చేయడం సరైందికాదన్నారు. ఇష్టారీతిన రేవంత్ సోదరులు కబ్జాలు చేస్తుంటే.. తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటామని శాసనమండలి సాక్షిగా హామీ ఇచ్చిందన్నారు. తనను కొంతమంది బాధితులు వచ్చి కలిశారని.. బాధితుల తరఫున మేమే ముందుండి పోరాడతామన్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ […]

రేవంత్ రెడ్డి భూకబ్జాలు, అక్రమాలను చూస్తూ ఊరుకోం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2020 | 6:41 PM

Share

రేవంత్ రెడ్డి భూఅక్రమణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు మండిపడ్డారు. ఓ బాధ్యతాయుతమైన ఎంపీగా పదవిలో ఉండి.. దళితుల భూములను కబ్జా చేయడం సరైందికాదన్నారు. ఇష్టారీతిన రేవంత్ సోదరులు కబ్జాలు చేస్తుంటే.. తాము చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటామని శాసనమండలి సాక్షిగా హామీ ఇచ్చిందన్నారు. తనను కొంతమంది బాధితులు వచ్చి కలిశారని.. బాధితుల తరఫున మేమే ముందుండి పోరాడతామన్నారు. దళితుల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశాననన్నారు. బాధితుల వెనకాల లక్షలమంది దళితులు ఉన్నారని.. రేవంత్ సోదరులకు భయపడాల్సిన అవసరం లేదని బాధితులకు ధైర్యం ఇచ్చామన్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలో ఈ భూకబ్జా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు. అటు గోపన్‌పల్లి భూదందాపై కూడా త్వరలోనే స్పందిస్తామన్నారు. దళిత భూములను కబ్జా చేసిన రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.