Jagadish Reddy: తెలంగాణలో కరెంట్ కోతలు తెచ్చేలా కుట్రలు.. కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రెండు ప్రధాన పార్టీల నడుమ కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

Jagadish Reddy: తెలంగాణలో కరెంట్ కోతలు తెచ్చేలా కుట్రలు.. కేంద్రంపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు
Jagadish Reddy
Follow us

|

Updated on: Feb 20, 2023 | 4:23 PM

బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. రెండు ప్రధాన పార్టీల నడుమ కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి కేసీఆర్ భయం పట్టుకుందంటూ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను నిలువరించడమే పనిగా మోడీ పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో కరంట్ కోతలు తెచ్చేలా మోడీ అండ్ గ్యాంగ్ కుట్రలు చేస్తున్నారంటూ కేంద్రంపై మండిపడ్డారు. గుజరాత్‌లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్ట.. మోడీ రైతుల ఉసురు తీసుకుంటున్నారంటూ ఆరోపించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని.. అందుకోసం ప్రణాళికలు రచించించదని ఆరోపించారు. బీజేపీని తరిమి కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో కరెంటు కోతలే లక్ష్యంగా ప్రణాళిక చేస్తున్నారంటూ జగదీష్‌ రెడ్డి విమర్శించారు.

అంతకుముందు కూడా మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంపై పలు విమర్శలు చేశారు. విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్‌ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్‌సీ నిర్ణయాన్ని తప్పుబట్టిన మంత్రి.. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆదాని లాంటి ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. సంస్కరణల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల డబ్బులు దోచిపెట్టేందుకే కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..