వ్యాక్సిన్ మాయ.. చనిపోయిన వ్యక్తికీ కరోనా టీకా వేసినట్లు మెసేజ్.. కంగుతిన్న కుటుంబసభ్యులు

కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోకుండానే తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. అంతే కాదు.. ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసేజ్‌ రావడంతో...

వ్యాక్సిన్ మాయ.. చనిపోయిన వ్యక్తికీ కరోనా టీకా వేసినట్లు మెసేజ్.. కంగుతిన్న కుటుంబసభ్యులు
Follow us

|

Updated on: Feb 19, 2022 | 10:35 AM

కరోనా వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకోకుండానే తీసుకున్నట్టు సర్టిఫికెట్స్ డౌన్‌లోడ్ అయ్యాయి. అంతే కాదు.. ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసేజ్‌ రావడంతో ఆ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. సమయానికి టీకాలు తీసుకున్నా కొందరికి సర్టిఫికెట్లు రావడం లేదు. కానీ చనిపోయిన వారికీ ధ్రువపత్రాలు రావడం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం(Kothagudem) జిల్లా కొత్తగూడెం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల తప్పిదమో లేక సాంకేతిక కారణాలతో ఇలా జరిగిందా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. దీంతో వైద్యశాఖ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని న్యూ గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొత్త మల్లారెడ్డి.. ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఈ నెల 11న చనిపోవడంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంతిమ సంస్కారం నిర్వహించిన ఆరు రోజుల తర్వాత మల్లారెడ్డి బూస్టర్ డోస్ వేసినట్లు ఆయన ఫోన్ కు మెసేజ్ వచ్చింది. లింక్ ఓపెన్ చేసి, సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసిన కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

మల్లారెడ్డికి మొదటి డోస్ వ్యాక్సినేషన్ 2021 ఏప్రిల్ 9 న, రెండో డోస్ 2021 మే 10న, బూస్టర్ డోస్ టీకా 2022 ఫిబ్రవరి 16న వేసినట్టు అందులో ఉండటంతో అయోమయానికి గురయ్యారు. ఇది పొరపాటుగా జరిగిందా? లేక టార్గెట్ కోసం గతంలో వేసిన ఆధార్ నంబర్లను ఫీడ్ చేసుకున్నారా ?, ఇలా అసలు ఎన్ని వ్యాక్సిన్లు వేశారు. వ్యాక్సిన్ వేయకుండా రికార్డులకు ఎక్కించినవి ఎన్ని? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని మల్లారెడ్డి కుటుంబసభ్యులు, స్థానికులు కోరుతున్నారు.

మరణించిన తర్వాత వ్యాక్సిన్ వేసినట్లు వచ్చిన మెసేజ్ పై డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష స్పందించారు. మల్లారెడ్డి మరణించిన విషయం స్థానిక ఏఎన్ఎం వ్యాక్సినేషన్ రిజిస్టర్లో ఆయన పేరు రౌండ్ చేశారని, కానీ పొరపాటున చనిపోయిన వ్యక్తి సెల్ ఫోన్ కు మెసేజ్ వెళ్ళిందన్నారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read

Kisan Drones: రైతులకు మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. పంట పొలాల్లో పురుగుమందు పిచికారీ కోసం కిసాన్‌ డ్రోన్‌లు

Viral Video: క్లాస్ రూంలో పాట పాడి ఫేమసైన పంతులు.. వైరల్ వీడియో

TTD: తిరుమల కొండపై ప్రైవేటు ఫుడ్‌ వ్యవస్థ నియంత్రణ సాధ్యమేనా..? టీటీడీ నిర్ణయం సక్సెస్‌ అయ్యేనా..?

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..