AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medak District: మొన్న వర్షాలు, ఇప్పుడు తెగుళ్లు.. మొయిపురుగుతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..

Medak District: అతివృష్టిగా మారిన వర్షాలు చాలా చోట్ల రైతన్నలను కలవర పెట్టాయి. అలాగే ఈ వర్షాల ధాటికి పలు చోట్లు పంట పొలాలు అన్నీ నీట మునిగి పోయాయి. అందులో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులకు, మొగి పరుగుల రూపంలో మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ముందుగా వేసిన వరి చేళ్ళకు మొగి పురుగు తగిలి, వరి కాండం పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. వేసిన వరికి తెగులు తగలడంతో

Medak District: మొన్న వర్షాలు, ఇప్పుడు తెగుళ్లు.. మొయిపురుగుతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..
Paddy Cultivation
P Shivteja
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 12:44 PM

Share

మెదక్ జిల్లా, ఆగస్టు 7: రైతులకు మొన్నటి వరకు ఒక బాధ.. అది పోయిందనుకునే లోపే ఇప్పుడుఇంకో బాధ మొదలైంది. మొన్నటి వరకు విస్తారంగా కురిసిన వర్షాలు పడ్డాయి. ఇక పంటలకు డోక లేదని అనుకుంటున్న సమయంలోనే అవి కాస్త అతివృష్టిగా మారి చాలా చోట్ల రైతన్నలను కలవర పెట్టింది. అలాగే ఈ వర్షాల ధాటికి పలు చోట్లు పంట పొలాలు అన్నీ నీట మునిగి పోయాయి. అందులో నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులకు, మొగి పరుగుల రూపంలో మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. ముందుగా వేసిన వరి చేళ్ళకు మొగి పురుగు తగిలి, వరి కాండం పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది. వేసిన వరికి తెగులు తగలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా రైతులు.

జిల్లాలోని దుబ్బాక మండలంలో రాజక్క పేట, చెల్లాపూర్‌తో పాటు చుట్టుపక్కల పలు గ్రామాల్లో రైతులు ఈ సారి వరిసాగు పెద్ద మొత్తంలో వేశారు.. అయితే మొన్నటి వరకు భారీగా కురిసిన వర్షానికి కొందరు రైతులు ముందుగానే వరి నాట్లు వేయగా ఇప్పుడు ఆ వరి పైరుకు మొగి పురుగు సోకి పూర్తిగా కాండాన్ని పాడు చేస్తున్నాయి. ఇది ఇలాగే ఉంటే వరి పంట మొత్తం దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మొగి పరుగుల బారిన పడకుండా రైతన్నలు ఏం చేయాలంటే.. ముందుగా నారుమల్లు దున్ని, నారు మడుల్లో నారు పోసేటప్పుడు కార్బోఫిల్ గుళికలు కానీ కాటో బెట్ గుళికలు కానీ ఒక కిలో నారుమళ్ళలో చల్లుకోవాలి. దీనివల్ల ఒక నెల వరకు మొగిపురుగును నివారించుకోవచ్చు. నాటు వేసిన మడుల్లో ఐరవై నుండి నెల రోజుల తర్వాత ఎకరానికి 8 కిలోల కార్బోఫిల్ గుళికలు కానీ, కాటోబెట్ గుళికలు కానీ లేదంటే ఫెలో గుళికలు వేయాలని, వీటి వల్ల మొగి పురుగును నివారించవచ్చని చెబుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పురుగు ఉధృతి పెరిగితే క్లోరైడ్ పౌడర్ 400 గ్రాములు తీసుకొని.. 200 గ్రాముల నీటిలో వేసి పిచికారీ చేయాలి.. ఇలా చేస్తే పురుగు ఉధృతి పూర్తిగా తగ్గిపోతుందని వారు సూచిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కురిసిన వర్షాలతో, ఇప్పుడు ఈ మొగిపరుగుల బాధతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. వరి సాగు ప్రారంభ దశలోనే ఇలాంటి తెగుళ్లు ఎదురైతే పంట పండించలేమని వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?