AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇష్టం లేని పెళ్లితో పుట్టింటికి చేరిన యువతి.. తప్పతాగి తండ్రి చేసిన దారుణం..

ఇటీవలి కాలంలో గత కొద్దిరోజులుగా నవ వధువు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరోకరు ఇలా వరుసగా కొత్త పెళ్లి కూతుర్లు మరణించిన ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి.

Telangana: ఇష్టం లేని పెళ్లితో పుట్టింటికి చేరిన యువతి.. తప్పతాగి తండ్రి చేసిన దారుణం..
Mbnrf
Jyothi Gadda
| Edited By: Ravi Kiran|

Updated on: May 31, 2022 | 4:51 PM

Share

Telangana Crime News: ఇటీవలి కాలంలో గత కొద్దిరోజులుగా నవ వధువు మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేశారని ఒకరు, ప్రేమ పెళ్లి జరగలేదని మరోకరు ఇలా వరుసగా కొత్త పెళ్లి కూతుర్లు మరణించిన ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన గంటలు, రోజుల వ్యవధిలోనే పెళ్లి కూతురి మరణం ఆ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాణి ఆరకముందే, ద్వారాలకు కట్టిన తోరణాలు వాడిపోక ముందే నవ వధువు అనంత లోకాలకు చేరిపోవటం అందరినీ కలచివేస్తోంది. తాజాగా మరో నవ వధువు తల్లితో సహా తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.

నవ వధువు కన్నతండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.. మహబూబ్ నగర్ శివారు ప్రాంతమైన జైన్ అలిపూర్ గ్రామంలో గత రాత్రి.. కృష్ణయ్య అనే వ్యక్తి.. తన భార్య కళమ్మ.. కన్న కూతురు సరస్వతిలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు.. అనంతరం తను కూడా గుళికల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. సరస్వతి కి ఈ నెల 8వ తేదీన వివాహం జరిగింది.. కాగా తనకు ఇష్టంలేని పెళ్లిచేశారని వారం క్రితం పుట్టింటికి తిరిగి వచ్చింది సరస్వతి.. అత్తారింటికి వెళ్లేందుకు ససేమీరా ఇష్టపడలేదు. తల్లి కళమ్మ కూడా కూతురికి అండగా నిలిచేది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ కోవలోనే గత రాత్రి ఫుటుగా తాగి ఇంటికి వచ్చిన కృష్ణయ్య భార్య.. కూతురుతో గొడవపడ్డాడు. కర్రతో విచక్షణా రహితంగా మోదాడు.. దాంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం కృష్ణయ్య కూడా గుళికల మందు సేవించాడు.. ఈ విషయాన్ని కృష్ణయ్య ఫోన్ ద్వారా బంధువులకు తెలియజేయడంతో.. బంధువులు వచ్చి ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.. కృష్ణయ్య కొడుకు బాలరాజుతో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ