గ్లాసుడు గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే..

27 February 2026

TV9 Telugu

TV9 Telugu

రోజూ ఒక గ్లాసుడు పాలు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలల్లో చిటికెడు పసుపు కలిపి రోజూ తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మరెన్నో లాభాలు చేకూరుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

ఇందులో ఉండే యాంటీఆక్సీడెంట్లు వయసు మళ్లిన ఛాయలు కనిపించకుండా చేస్తాయి. చర్మం మీద మొటిమలు, మచ్చలు రాకుండా కాపాడుతుంది

TV9 Telugu

చర్మం మీద ఉండే మృత కణాలను తొలగించి, చర్మం మెరిసేలా చేస్తుంది. కళ్ల కింద వచ్చే నల్లని వలయాలను తొలగిస్తుంది. ఎండవేడికి వచ్చే టాన్‌ను తొలగిస్తుంది

TV9 Telugu

చర్మానికి మెరుపుదనాన్ని ఇస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగండి. హాయిగా నిద్రపడుతుంది

TV9 Telugu

పసుపుతో చేసే  స్మూథీలు, మిల్క్‌షేక్‌లు చేస్తుంటారు. వీటిని కూడా తాగేయవచ్చు. వంటల్లో కూడా తప్పనిసరిగా పసుపు వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

TV9 Telugu

పసుపులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి. పాలు పసుపుతో కలిపి తాగడం వల్ల ఇందులోని కర్కుమిన్ పాలల్లో కరిగిపోతుంది. పాలలో కొవ్వు దానిని కరిగేలా చేస్తుంది

TV9 Telugu

పసుపులో విటమిన్ సి అధికంగా ఉండే మసాలా దినుసు. అందువల్ల పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తరచుగా జలుబుతో బాధపడేవారు రోజూ తగిన పరిమాణంలో పసుపు, నల్ల మిరియాలు కలిపిన తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది

TV9 Telugu

ఇది ఆరోగ్య లక్షణాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తుంది. పాలలో ఎముకలను బలపరిచే కాల్షియం అనే పోషకం ఉంటుంది. పాలు తాగడం వల్ల కీళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది