AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..

వరి మంటలు చల్లారడం లేదు. ధాన్యం కొనుగోలుపై రాజుకున్న వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది.

CM KCR: గురువారం మహాధర్నాలో పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలుపై ప్రధాని మోడీకి లెటర్‌..
Maha Dharna
Sanjay Kasula
|

Updated on: Nov 17, 2021 | 10:06 PM

Share

Maha dharna: వరి మంటలు చల్లారడం లేదు. ధాన్యం కొనుగోలుపై రాజుకున్న వివాదం కంటిన్యూ అవుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం TRS కేంద్రంతో తాడో-పేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. తెలంగాణ ప్రభుత్వ..కేంద్రానికి మధ్య ధాన్యం కొనుగోల్ల విషయంలో రాజుకున్న అగ్గి రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తోంది. రైతుల దగ్గరున్న ధాన్యం కొనుగోలు చేసే విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరికించి రైతుల దగ్గర రాజకీయం చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈవిషయంపైనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రం వైఖరిని నిరసిస్తూ మహాధర్నాకు పిలుపునిచ్చింది.

గురువారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. ఈ ధర్నాలో సీఎం కేసీఆర్‌తో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంతా పాల్గొంటారు. అటు నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో గులాబీనేతలు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం పండించిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలుపై FCIకి ఆదేశాలివ్వాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు. 2020-21 ర‌బీలో మిగిలిన 5 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. పంజాబ్ త‌ర‌హాలో తెలంగాణ‌లో కూడా ధాన్యం సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని సూచించారు. ఏటా ఉత్పత్తి పెరుగుతున్నా సేక‌రించే మొత్తం పెర‌గ‌ట్లేదని లేఖలో ప్రస్తావించారు.

టీఆర్‌ఎస్‌ నేతలకు కౌంటరిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలకు నాడు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. మొత్తంగా అటు టీఆర్‌ఎస్‌ ఇటు బీజేపీ మధ్య మాటల వేడి తగ్గడం లేదు. వరి కేంద్రంగా ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: Air pollution: ఉద్యోగులు ప్రజా రవాణాను వినియోగించండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు..

PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..

పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
మార్చిలోగా ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..!
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
బుడ్డోడికి ఏమైనా జరిగుంటే ఎవరిది బాధ్యత..?
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రిపబ్లిక్ డే బ్రేక్ కావాలా?.. బడ్జెట్లో 5 బెస్ట్ ప్లేసెస్ ఇవే..
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పోస్టుల వివరాలు తప్పక తెలుసుకోండి
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
ఉపాధి హామీ కూలీలకు గుడ్‌న్యూస్‌.. ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు
'మీరు తోపులకు బాప్‌.. మీ సినిమాను ఎవడూ ఆపలేడు: టాలీవుడ్ నటుడు