PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..

PM Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను

PM Narendra Modi: ఈనెల 19న యూపీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఎందుకోసమంటే..
Follow us

|

Updated on: Nov 17, 2021 | 3:38 PM

PM Narendra Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6250 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను పీఎం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. నవంబర్ 19వ తేదీన మధ్యాహ్నం 2: 45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వీర్ ప్రాజెక్ట్, భయోని డ్యామ్ ప్రాజెక్ట్, మజ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ. 3,250 కోట్లు కాగా, ఈ ప్రాజెక్టుల వల్ల మహోబా, హమీర్‌పూర్, బండ, లలిత్‌పూర్ జిల్లాల్లోని దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు. తద్వారా లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందుతారు. ఈ ప్రాంతానికి త్రాగునీటి సమస్య కూడా తీరిపోతుందన్నారు.

ఆ తరువాత సాయంత్రం 5:15 గంటలకు ఝాన్సీలోని గరౌత్‌లో 600 మెగావాట్ల అల్ట్రామెగా సోలార్ పవర్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ. 3000 కోట్లకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. చవకైన విద్యుత్, గ్రిడ్ స్థిరత్వం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఝాన్సీలో అటల్ ఏక్తా పార్కును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీదుగా దాదాపు 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 11 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పార్క్‌ను నిర్మించారు. ఇందులో లైబ్రరీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహం కూడా ఉంటుంది. ప్రఖ్యాత శిల్పి శ్రీ రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని నిర్మించారు.

Also read:

Cryptocurrency: క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిషేధించవచ్చు.. త్వరలో కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Viral Video: పేరుకే బుడ్డోడు.. బౌలింగ్‌లో మాత్రం కాదు.. తన స్పిన్‌‌తో బ్యాట్స్‌మెన్‌ను ఎలా భయపెట్టాడో చూడండి..!

Good News: తెలంగాణలోని ఆ ప్రభుత్యోగులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే పీఆర్సీ అమలు

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్