AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basara: బాసర సరస్వతి ఆలయ హుండీలో లేఖ కలకలం.. అందులో ఏం రాసుందంటే..

నిర్మల్‌ జిల్లా బాసర ఆలయ హుండీలో ఓ లేఖ కలకలం రేపింది. కానుకలు లెక్కిస్తుండగా కనిపించిన ఆ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆ లెటర్‌లో ఏముంది?.. అసలెవరు రాశారు?.. ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఏదైనా టెంపుల్‌కు వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకుని.. హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చాలని ఆయా దేవుళ్లకు మొక్కుకుంటారు.

Basara: బాసర సరస్వతి ఆలయ హుండీలో లేఖ కలకలం.. అందులో ఏం రాసుందంటే..
Basara Temple
Shiva Prajapati
|

Updated on: Jul 21, 2023 | 10:09 AM

Share

నిర్మల్‌ జిల్లా బాసర ఆలయ హుండీలో ఓ లేఖ కలకలం రేపింది. కానుకలు లెక్కిస్తుండగా కనిపించిన ఆ లేఖ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ.. ఆ లెటర్‌లో ఏముంది?.. అసలెవరు రాశారు?.. ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఏదైనా టెంపుల్‌కు వెళ్లినప్పుడు మొక్కులు తీర్చుకుని.. హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. కోరిన కోర్కెలు తీర్చాలని ఆయా దేవుళ్లకు మొక్కుకుంటారు. మరికొందరు.. కోర్కెలు నెరవేర్చాలని కట్టిన ముడుపులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు.. చిట్టీలు రాసి హుండీల్లో వేస్తుంటారు. కానీ.. నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలోని హుండీలో ఏకంగా ఓ లేఖనే వేయడం చర్చనీయాంశంగా మారింది. బాసర ఆలయంలోని కానుకల లెక్కింపులో భాగంగా హుండీని తెరవగా అందులో వినతి పత్రం కనిపించింది.

ఆ లేఖ ఆర్జీయూకేటీ బాసరలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖలో.. బాసర ట్రిపుల్‌ ఐటీలోని పరిస్థితులను వివరించారు. శత కోటి దండాలతో తమరి పాదాలకు ప్రణమిల్లి వ్రాయునది ఏమనగా.. అంటూ లేఖను ప్రారంభించారు. అమ్మా.. మేము ఎందరికో మా బాధలు విన్నవించుకున్నాము.. కానీ.. మీకు ఏనాడు తెలుపలేదు. మీరు జ్ఞానం అందించే అమ్మగా.. తమ తప్పులను క్షమించి పిల్లల బాధలు తీర్చే విధంగా పాలకులు, అధికారులను మేలు కొలపాలని ప్రార్థించారు. రెండేళ్లుగా తాము పోరాటాలు చేస్తున్నామని.. ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న తమ పిల్లలు వారం రోజులు పోరాటం చేసినా.. అటు అధికారులు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏమాత్రం కనికరించలేదని లేఖలో రాసుకొచ్చారు.

చదువుల కోసం చేసిన పోరాటానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయిందమ్మా.. అధికారుల ఒత్తిళ్లకు లోనై కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇకనైనా అధికారులకు జ్ఞానం ప్రసాదించి తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని లేఖలో వేడుకున్నారు. అయితే.. హుండీలో లభ్యమైన ఈ లేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరి.. ట్రిపుల్‌ ఐటీ విద్యార్ధుల పేరెంట్స్‌ కమిటీ రాసిన లేఖపై అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?