ఇందిరాపార్క్ ధర్నా చౌక్ను ఎత్తివేసి.. మళ్లీ అదే ప్రాంతంలో ధర్నా చేపట్టడం వింతగా ఉంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు..
కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేసీఆర్ అధ్యక్షతన ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మహా ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ధర్నాపై మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. 2016లో ఇందిరాపార్క్ధర్నాచౌక్ ఎత్తివేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, రైతులకు బేడీలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే చౌక్ వద్ద ధర్నా చేయడం ఓ వింతగా ఉందని ఆయన ఆరోపించారు. మరో పదేళ్లూ ప్రగతి భవన్ లోనే తిష్టవేసి కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం పన్నుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్పై ఆయన పలు విమర్శలు చేశారు.
2016లో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ ఎత్తివేసి, ప్రశ్నించే గొంతుకలను అణిచివేసి, రైతులకు బేడీలు వేసిన KCR, నేడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే చౌక్ వద్ద ధర్నా చేయడం ఓ వింత. మరో పదేళ్లూ ప్రగతి భవన్ లోనే తిష్టవేసి కుటుంబపాలన సాగించాలన్న పన్నాగం.
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) November 18, 2021
ఇవి కూడా చదవండి