CM KCR Maha Dharna: వరి కొనుగోలుపై కేంద్రం కిరికిరి చేస్తే.. కయ్యం కాదు యుద్ధం పక్కాః సీఎం కేసీఆర్‌

వరి కొనుగోళ్లపై కేంద్రంతో యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు

CM KCR Maha Dharna: వరి కొనుగోలుపై కేంద్రం కిరికిరి చేస్తే.. కయ్యం కాదు యుద్ధం పక్కాః సీఎం కేసీఆర్‌
Cm Kcr
Follow us

|

Updated on: Nov 18, 2021 | 1:04 PM

CM KCR in TRS Maha Dharna:తెలంగాణ రైతుల ప్రయోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేందుకు అవసరమైతే ఢిల్లీ వరకు యాత్ర చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ప్రకటించారు. సీఎం, మంత్రులు ధర్నా చేసే పరిస్థితిని కేంద్రమే తీసుకొచ్చిందన్నారు. అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నట్టే.. అంతకుమించిన పోరాటాలతో రైతాంగం ప్రయోజనాలు కాపాడుతామని రైతులకి భరోసానిచ్చారు. గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ 51 గంటల దీక్ష చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం కళ్లు తెరిపించడానికే ఈ యుద్ధం చేస్తున్నామన్నారు. ఇందిరాపార్క్‌ దగ్గర జరుగుతున్న దీక్షలో వరి కంకులతోపాటు నాగలిని పట్టుకున్నారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.

వ్యవ‌సాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్న సీఎం.. కేంద్రం విధానాల వ‌ల్ల మ‌న రైతాంగం దెబ్బతినే పరిస్థితి నెలకొందన్నారు. రైతాంగం, వ్యవ‌సాయం ప‌ట్ల కేంద్ర వైఖ‌రి మార్చుకోవాల‌న్న సీఎం.. రైతు నిరంకుశ చ‌ట్టాల‌ను విర‌మించుకోవాల‌న్నారు. కేంద్ర తీసుకువచ్చిన కొత్త విద్యుత్ విధానాన్ని మార్చుకోవాల‌ని అనేక‌సార్లు చెప్పామని.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదన్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఈరోజుతో ఆగిపోదని.. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదు.. మ‌న హ‌క్కులు సాధించే వ‌ర‌కు, రైతుల ప్రయోజ‌నాలు ప‌రిర‌క్షించేంత వ‌ర‌కు, ఉత్తర భార‌త‌దేశంలోని రైతుల పోరాట‌ల‌ను క‌లుపుకొని భ‌విష్యత్‌లో ఉధృతం చేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

వ్యవ‌సాయ రంగాన్ని కేంద్రం విస్మరిస్తోందన్న కేసీఆర్.. పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన‌ట్టే తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్రాన్ని వేడుకున్నమని, ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసినా.. ఉలుకు ప‌లుకు లేదన్నారు. తెలంగాణ రైతాంగం బాధలు ప్రపంచానికి, దేశానికి తెలియజేసేందుకే ఈ మహా ధ‌ర్నాకు శ్రీకారం చుట్టామ‌న్నారు. తెలంగాణ గ్రామాల్లో కూడా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తామని, కేంద్రం దిగివ‌చ్చి మ‌న రైతాంగానికి న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం కొన‌సాగుతూనే ఉంటుందన్నారు. ఈ ఉద్యమాన్ని ఉప్పెనలా కొన‌సాగిస్తామ‌ని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగం ఉత్పత్తుల‌ను కొనుగోలు చేయాల‌ని, రైతుల ప్రయోజ‌నాల‌ను ర‌క్షించుకోవాల‌ని ఈ యుద్ధాన్ని ప్రారంభించామని సీఎం కేసీఆర్ తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో ప్రారంభ‌మైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అవ‌స‌ర‌మైతే ఈ లొల్లి ఢిల్లీ దాకా వెళ్తుందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడికైనా ఎందాకైనా తగ్గేదే లే అని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగానికి అశ‌నిపాతంలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు దాపురించాయని మండిపడ్డారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకే ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టామన్నారు.

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్