AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే..

హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉంది. తాజాగా నగరానికి చెందిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో కొందరు మహిళలు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఇనుప బ్రష్‌లు, చీపుర్లతో మట్టిని, ధూళిని సేకరిస్తూ కనిపించారు. సాధారణంగా చూస్తే ఇది వీధుల శుభ్రతలా అనిపించినప్పటికీ, దీని వెనుక ఒక ఆసక్తికరమైన వ్యాపార రహస్యం ఉంది.

హైదరాబాద్‌ మట్టి కూడా బంగారమే.. కిలో వంద రూపాయలకు అమ్మకం..! ఏరియా ఎక్కడంటే..
Hyderabad Gold Soil
Jyothi Gadda
|

Updated on: Aug 10, 2026 | 5:11 PM

Share

మట్టి బంగారంతో సమానం అనే సామెత మనకు తెలిసిందే. కానీ, హైదరాబాద్‌లోని ఒక వీధిలో ఉండే మట్టి నిజంగానే బంగారంతో నిండి ఉందంటే నమ్మగలరా? ఇటీవల సోషల్ మీడియాలో విష్ణు శర్మ అనే కంటెంట్ క్రియేటర్ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో రోడ్ల మీద లభించే మట్టిని కిలో రూ. 100 చొప్పున అమ్ముతున్నారనే వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో స్థానిక మహిళలు రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఇనుప బ్రష్‌లు, చీపుర్ల సహాయంతో మట్టిని, చెత్తను పోగుచేస్తూ కనిపించారు. మొదటి చూపులో ఇది సాధారణ వీధుల శుభ్రత పనులలా అనిపించినప్పటికీ, ఇది సాధారణ బురద కాదు… బంగారం! అంటూ వీడియోలో వివరించారు. హైదరాబాద్‌లోనే మట్టి కిలో వంద రూపాయలకు అమ్ముడయ్యే ఏకైక ప్రాంతం ఇదేనని ఆ వీడియో ద్వారా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మట్టిలో బంగారం ఎలా చేరుతుంది?:

హైదరాబాద్‌లోని ఈ ప్రసిద్ధ జ్యువెలరీ తయారీ మార్కెట్‌లో వందలాది స్వర్ణకారులు రోజువారీగా ఆభరణాల తయారీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. బంగారాన్ని కత్తిరించడం, కరిగించడం, డిజైన్లు చెక్కడం, పాలిష్ చేయడం వంటి వివిధ ప్రక్రియలలో అతి సూక్ష్మమైన బంగారు ధూళి గాలిలోకి ఎగిరి లేదా పనివారి ద్వారా వీధుల మట్టిలో, రాళ్ల సందుల్లో కలుస్తుంది. కాలక్రమేణా ఈ మట్టిలో స్వర్ణ కణాల సాంద్రత పెరుగుతుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మట్టి శుద్ధి ప్రక్రియ:

రోడ్ల పక్క నుంచి సేకరించిన ఈ మట్టిని ప్రత్యేక రీఫైనర్లకు విక్రయిస్తారు. వారు ఈ మట్టిని నీరు, వివిధ రసాయనాల సహాయంతో శుద్ధి చేసి, అందులోని మట్టిని వేరు చేసి, అడుగున మిగిలే స్వచ్ఛమైన బంగారాన్ని సేకరిస్తారు. ఈ విధంగా రోడ్లపై వృథాగా పడి ఉండే ధూళిని సేకరించి విక్రయించడం ద్వారా స్థానిక మహిళలకు మంచి ఉపాధి లభించడమే కాకుండా, నగరంలో వినూత్న రీతిలో సాగుతున్న ఈ స్వర్ణ వ్యాపారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us