Hyderabad: బాలుడ్ని ట్రాప్ చేసిన కి’లేడి’.. లైంగిక దాడి… ఆపై
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 14 ఏళ్ల బాలుడిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. మాయమాటలు చెప్పి బాలుడితో అసభ్యకర వీడియోలు కూడా తీసుకుంది.
సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. రోజుకో విచిత్రమైన ఘటన గురించి వినాల్సి వస్తుంది. మహమ్మారి వైరస్లు వెంటాడుతున్న.. జీవితాలు చిధ్రమైపోతున్న జనాల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. తాజాగా హైదరాబాద్లో ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. మైనర్ బాలుడ్ని ఓ మహిళ ట్రాప్ చేసింది. అతడిపై లైంగిక దాడి చేసింది. బాలుడితో ప్రైవేట్గా గడుపుతోన్న సమయంలో మరో వ్యక్తి సాయంతో వీడియోలు చిత్రీకరించింది. అనంతరం బెదిరింపులకు దిగి అతడిని ముప్పు తిప్పలు పెట్టింది. బాలుడి ఇంట్లోని బంగారం, నగదు ఇవ్వాలని ఒత్తిడి చేసి.. కాజేసింది. ఈ ఘటన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న బాలుడి(14) కుటుంబం ఇటీవల టోలిచౌకి నుంచి జూబ్లీహిల్స్కు మారింది. ఈ సమయంలో అల్మారాలోని 20 తులాల గోల్డ్ కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేదు. బాలుడ్ని తల్లి గట్టిగా అడగడంతో, బెంగళూరులో నివసించే తండ్రి బంధువుకు ఇచ్చినట్లు తెలిపాడు. ఎందుకు ఇచ్చావని ప్రశ్నించగా.. గతంలో స్కూల్ వద్దకు వచ్చి తనను చార్మినార్లోని లాడ్జ్కు తీసుకెళ్లిందని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పి బోరుమన్నాడు. మరో వ్యక్తితో కలిసి దీన్ని ఆమె వీడియో తీసి, బెదిరించడంతో ఇంట్లోని 20 తులాల గోల్డ్తో పాటు రూ.6 లక్షలు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. తన కుమారుడిపై ఆమె మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడిందని… చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి తల్లి బుధవారం పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మూడేళ్ల కిందట జరిగిందని, పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
Also Read: మా సౌండ్ బాక్సులు డ్యామేజ్ అవుతాయ్.. యూఎస్లో నోటీసు బోర్డ్స్.. అల్లాడిచ్చిన తమన్
Akhanda: ‘బాలా బాబాయి చింపేశావ్’.. వైరల్ అవుతోన్న జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్