AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. బస్సు టికెట్‌తో పాటే..

ఇప్పటికే తిరుమల శ్రీవారికి భక్తులకు ఈ విధానాన్ని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. తిరుపతికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 300 టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులకు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తోంది...

TSRTC: శ్రీశైలం వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌.. బస్సు టికెట్‌తో పాటే..
TSRTC
Narender Vaitla
|

Updated on: Feb 12, 2024 | 9:42 AM

Share

రకరకాల ఆఫర్లను, వినూత్న సేవలను అందిస్తూ ప్రయాణికులను ఆకర్షిస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ముఖ్యంగా దేవలయాలకు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తూ ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటు ఆదాయాన్న ఆర్జిస్తోంది. ఇక బస్సు టికెట్‌తో పాటు ఆలయాలకు సంబంధించిన దర్శన టికెట్లను సైతం అందిస్తోంది తెలంగాణ ఆర్టీసీ.

ఇప్పటికే తిరుమల శ్రీవారికి భక్తులకు ఈ విధానాన్ని అవలంభిస్తోన్న విషయం తెలిసిందే. తిరుపతికి టికెట్స్‌ బుక్‌ చేసుకున్న వారికి రూ. 300 టికెట్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే తాజాగా శ్రీశైలం మల్లిఖార్జున స్వామి వారి ఆలయానికి వెళ్లే భక్తులకు సైతం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం మధ్య నడిచే బస్సుల్లో ఈ విధాన్ని అమలు చేయనున్నారు.

త్వరలోనే ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఎంవోయూ కుదిరింది. స్పర్శదర్శనం టికెట్‌ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్‌ ధర రూ.150 ఉంటుందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌, శ్రీశైలం మధ్య 10 సూపర్‌ లగ్జరీ బస్సులను నడపనున్నారు. వారం రోజుల్లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ బస్సుల ఛార్జీల విషయానికొస్తే జేబీఎస్‌ నుంచి పెద్దలకు రూ. 750, పిల్లలకు రూ. 540, ఎమ్‌జీబీఎస్‌ నుంచి అయితే పెద్దలకు రూ. 700, చిన్నారులకు రూ. 510గా నిర్ణయించారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్‌ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో