AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెన్షన్ కోసం కోర్టుకు వెళ్తే అసలు గుట్టు బయటపడింది.. 70 ఏళ్ల వృద్ధుడికి జరిమానా.. ఎందుకో తెలుసా…

తెలంగాణ హైకోర్టు ఒక 70 ఏళ్ల వృద్ధుడిని జరిమానా విధించింది. తనకు జీతం రావట్లేదని కోర్టుకు వెళ్తే తిరిగి కోర్ట్ ఆయనకే దిమ్మ తిరిగేలా ధర్మాసానం తీర్పు ఇచ్చింది. నకిలీ పత్రాన్ని సమర్పించి సేవా ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి రూ.5,000 జరిమానా విధించింది.

పెన్షన్ కోసం కోర్టుకు వెళ్తే అసలు గుట్టు బయటపడింది.. 70 ఏళ్ల వృద్ధుడికి జరిమానా.. ఎందుకో తెలుసా...
Telangana High Court
Lakshmi Praneetha Perugu
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 30, 2024 | 7:25 PM

Share

తెలంగాణ హైకోర్టు ఒక 70 ఏళ్ల వృద్ధుడిని జరిమానా విధించింది. తనకు జీతం రావట్లేదని కోర్టుకు వెళ్తే తిరిగి కోర్ట్ ఆయనకే దిమ్మ తిరిగేలా ధర్మాసానం తీర్పు ఇచ్చింది. నకిలీ పత్రాన్ని సమర్పించి సేవా ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడికి రూ.5,000 జరిమానా విధించింది. ఈ వ్యక్తి పోలీస్ స్టేషన్‌లో 26 సంవత్సరాలకు పైగా స్వీపర్‌గా పనిచేశానని నకిలీ సర్టిఫికెట్ సమర్పించాడు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. కీలక తీర్పును వెలువరించింది.. అంతేకాకుండా.. కోర్టును మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అంటూ హెచ్చరించింది.

న్యాయస్థానం ఈ వ్యక్తి వయసు 70 ఏళ్లకు పైగా ఉందని పరిగణించి జరిమానా విధించింది. ఎవరైనా న్యాయవాది లేదా సలహాదారు తప్పుడు సమాచారం అందించడం ద్వారా కోర్టును మోసం చేయడానికి ప్రయత్నిస్తే, వారిని నేరుగా జైలుకు పంపిస్తామని హైకోర్టు హెచ్చరించింది. న్యాయమూర్తి జుకంటి అనిల్ కుమార్ ఈ కేసు తీర్పును వెల్లడించారు.

2018లో షేక్ జానిమియా అనే వ్యక్తి నకిలీ సేవా సర్టిఫికెట్ సమర్పించి, తన సేవా ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయించారు. అప్పుడు కోర్ట్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్‌కు అనుకూల ఉత్తర్వులను జారీ చేసింది. 1991 నుంచి 2018 వరకు చిల్కూర్ పోలీస్ స్టేషన్‌లో స్వీపర్‌గా పనిచేశానని, అయితే తనకు జీతం చెల్లించలేదని పేర్కొన్నాడు.

అయితే, కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఆయనకు ఎలాంటి జీతం చెల్లించకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ పిటిషన్‌తో కోర్ట్ ను ఆశ్రయించాడు జానిమియా. ఈసారి హోం సెక్రటరీ రవి గుప్తాను కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. కోర్ట్ ఆదేశాలతో రవి గుప్త కోర్ట్ కు హాజరయ్యారు.. అయితే.. పిటిషనర్ నకిలీ సర్టిఫికెట్ పొందాడని కోర్టుకు తెలిపారు.

2017లో జానిమియా హైకోర్టును ఆశ్రయించి, నలుగురు వారాల్లో గృహ విభాగం చెల్లింపులు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాలేదని 2018లో జమ్మియ కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశాడని తెలిపారు.

రవి గుప్త కోర్ట్ కి నివేదిక సమర్పించడంతో పిటిషనర్ పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ సర్టిఫికెట్ ల ద్వారా కోర్ట్ ను సైతం తప్పు దోవ పట్టించినందుకు 70 ఏళ్ల వృద్ధుడికి 5 వేల జరిమానా విధించింది. దీనిపై ధర్మాసంన ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టును తప్పుదోవ పట్టించాలని చూస్తే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని తీర్పులో చెప్పింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..