AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిర్‌పోర్టు అనుకునేరు.. మన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనే ఇది! ఎయిర్ కాంకర్, స్కై వేలు ఇంకా..

Secunderabad Railway station modernisation: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరో 13 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.గ్లోబల్ స్టాండర్డ్ లో నిర్మాణం జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతుంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డిజైన్ ఎలా ఉంది? అప్పటి అవసరాల దృష్ట్యా 151 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది..

ఎయిర్‌పోర్టు అనుకునేరు.. మన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనే ఇది! ఎయిర్ కాంకర్, స్కై వేలు ఇంకా..
Secunderabad Railway Station Modernization
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Nov 12, 2025 | 7:53 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 12: విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరో 13 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.గ్లోబల్ స్టాండర్డ్ లో నిర్మాణం జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా ఉండబోతుంది? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డిజైన్ ఎలా ఉంది? అప్పటి అవసరాల దృష్ట్యా 151 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. 10 ప్లాట్ ఫామ్ లతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోజుకు వందకు పైగా రైళ్ల ఆపరేషన్ జరుపుతూ…లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చుతుంది. వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టి లో పెట్టుకొని రీ డిజైన్ చేసి ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మార్చుతున్నారు. ఎన్నో అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి రానుంది.

ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్‌ను రీ డిజైన్‌ చేసి రూ.715కోట్లతో మొదట దశ పునర్మిర్మాణ పనులు చేపట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌కు ఒక మణిహారంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నిలవనుందని అన్నారు.రీ డిజైన్ అందుబాటులోకి రానున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3 వేల మంది ప్రయాణికులు కూర్చునే విధంగా వెయిటింగ్‌ హాలు, క్యాంటీన్‌ స్టాళ్లు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విమానాశ్రయాల్లో మాదిరిగా 2 ట్రావలేటర్లు, ఎయిర్ కాంకర్ ,పార్కింగ్ సమస్య కు చెక్ పెడుతూ,వాహనాల రద్దీ తగ్గించుకునేందుకు మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం తో పాటు మరెన్నో సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణం జరుగుతుంది.మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌లోకి వచ్చి వెళ్లేలా, స్టేషన్‌ నుంచి బస్టా్‌పల వరకు నడుచుకుంటూ వెళ్లేందుకు స్కై వే లు నిర్మనం జరుగుతుంది. పనులు పూర్తయితే రైౖల్వే స్టేషన్‌ నుంచి రోజూ 2 లక్షల కు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది.

నై.715 కోట్ల వ్యయం తో నిర్మాణం జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ 2026 డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నవి అన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకోవచ్చి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేల ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us