Hyderabad: రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఇద్దరు ప్రయాణీకులు.. వారి లగేజ్ చెక్ చేయగా
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు తెలుగు రాష్ట్రాలు చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాయి. అందులో నో డౌట్. ఎక్కడికక్కడ గంజాయి తరలింపును అడ్డుకుంటూ, డ్రగ్స్ ముఠాల అంతుచూస్తున్నాయి. అలాగే రైల్వే పోలీసులు సైతం రైళ్లలో గంజాయి రవాణాపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు తనీఖీలతో పాటు గంజాయి గుట్టు పట్టేందుకు డాగ్స్కి డ్రైనింగ్ ఇచ్చి రంగంలోకి దింపుతున్నారు.

పోలీసులు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నా గంజాయి రవాణా ఆగడం లేదు. తాజాగా సికింద్రాబాద్లో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. జల్సాలు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడ్డ అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను సికింద్రాబాద్ GRP, RPF పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర, ఒరిస్సాకు చెందిన ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి 28 లక్షల రూపాయల విలువ గల 57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జీవన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో కోణార్క్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన సునీల్, ఒడిశాకు చెందిన కరణ్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నారు.
హత్యలు, లూటీలు, దాడులు, లైంగిక నేరాలు.. క్రైమ్ ఎలాంటిదైనా దాని మూలం నిషానే. మత్తులో చిత్తవుతున్న యువత.. ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. నేర ప్రవృత్తిని ఒంట బట్టించుకుని.. సభ్య సమాజం నివ్వెరపోయేలా చేస్తున్నారు. మత్తు విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. మా దారి అడ్డదారి అంటూ మత్తు మాఫియా చెలరేగిపోతూనే ఉంది. కొత్త కొత్త దారుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. టెక్నాలజీ వినియోగిస్తూ డ్రగ్స్కు చాలావరకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. . మత్తుమాఫియాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్నారు పోలీసులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.