AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా!.. తస్మాత జాగ్రత్త

ఇది కల్తీ కాలం. అదీ ఇదీ అని కాదు. అన్ని ప్రొడక్ట్స్ కల్తీనే. పల్లెటూరల్లో కొద్దో, గొప్పో నయం. సిటీల్లో అయితే చివరికి వాటర్ కూడా కల్తీనే. కేటుగాళ్లు తెగబడిపోతున్నారు.

Hyderabad: మీ పిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా!.. తస్మాత జాగ్రత్త
Chocolates
Ram Naramaneni
|

Updated on: Feb 28, 2023 | 8:25 PM

Share

— మీ పిల్లలు తింటున్న చాక్లెట్లు, బిస్కెట్లు తింటున్నారా! అవి మంచివా? కాలం చెల్లినవా? ఈ ప్రశ్న ఎందుకంటే హైదరాబాద్ బోడుప్పల్‌లో రీసైక్లింగ్ ముఠా దొరికింది. వాళ్ల పని ఎక్స్‌పైరీ అయిన వస్తువలకు డేట్లు మార్చేయడం. మళ్లీ మార్కెట్‌లోకి వదులడం. ఆ జాబితాలో చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు,చిప్స్‌, లాలీపాప్స్‌ కూడా ఉన్నాయి.

— ఫుడ్‌ ఐటమ్స్‌ విషయంలో ఎక్స్‌పైరీ డేట్‌ చాలా ముఖ్యం. తేడావస్తే ఫుడ్ పాయిజన్‌ జరిగే ప్రమాదం ఉంది. కానీ రీసైక్లింగ్‌ ముఠా అవేమీ పట్టించుకోవడం లేదు. సబ్బులు, షాంపులు, కాస్మొటిక్స్‌ సైతం డేట్లు మార్చేసి, ఫ్రెష్‌ ప్రొడక్ట్స్‌గా మార్కెటింగ్‌ చేస్తున్నారు.

— కోఠిలోని హరిహంత్ కార్పొరేషన్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. బోడుప్పల్‌ గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. కోట్లు విలువ చేసే ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 300 రకాల వస్తువులను ముఠా రీసైక్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us