AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరంలో మరో భారీ స్కామ్.. వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 200 కోట్ల టోకరా

బయటకు వెళ్లే పరిస్థితి లేని మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాన్న ఆలోచనతో.. కేటుగాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. దీపాల్లో వేసే వత్తులు, మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్లల తయారీ పేరుతో రావుల కొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఏకంగా 200 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు.

Hyderabad: నగరంలో మరో భారీ స్కామ్.. వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో రూ. 200 కోట్ల టోకరా
Hyderabad Cheating
Surya Kala
|

Updated on: Nov 29, 2022 | 3:21 PM

Share

కాదేదీ కవితకనర్హం అన్నాడు నాడు శ్రీ శ్రీ.. నేడు మోసానికి కాదేది అనర్హం అంటున్నారు కొందరు కేటుగాళ్లు. సామాన్యుల బలహీనతలను ఆసరాగా తీసుకొని, నమ్మించి ఉన్నదంతా దోచుకొని ఉడాయిస్తున్నారు. అలాంటి భారీ మోసం హైదరాబాద్ నగరంలో బయటపడింది. ఆ కేటుగాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అమాయక మహిళలను నమ్మించి దాదాపు రూ.  200 కోట్లతో పత్తా లేకుండా పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నగరంలో మరో భారీ స్కామ్ బయటపడింది. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే అవకాశం. గృహిణులు కూడా ఆదాయం ఆర్జించే సువర్ణావకాశం అంటూ.. రకరకాల ప్రకటనలు ఇస్తూ అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. బయటకు వెళ్లే పరిస్థితి లేని మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాన్న ఆలోచనతో.. కేటుగాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు. దీపాల్లో వేసే వత్తులు, మహిళలు పెట్టుకునే బొట్టు బిళ్లల తయారీ పేరుతో రావుల కొల్లు రమేశ్‌ అనే వ్యక్తి ఏకంగా 200 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు.

నగరంలోని ఏఎస్‌రావునగర్‌లో ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో ఓ సంస్థను కొల్లు రమేశ్‌ స్థాపించాడు. దీపాల్లో వేసే వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి వినియోగించే యంత్రాలను విక్రయించాడు. దీపం వత్తులు తయారు చేసే యంత్రం ఒక లక్షా 70 వేలు కాగా.. బొట్టు బిళ్లల యంత్రం లక్షా 40 వేల చొప్పున వినియోగదారులకు విక్రయించాడు. తాను ఇచ్చే ముడిసరుకుతో వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేస్తే కిలోల చొప్పున డబ్బు చెల్లిస్తానని చెబుతూ.. బాధితులను బుట్టలో వేసుకున్నాడు. ఈ మోసగాడి మాటలు నమ్మిన బాధితులు వాళ్ల బంధువులతో సైతం మిషిన్లు కొనిపించారు. కొన్నిరోజులకు సరుకు కొనడం లేదేంటి అని నిలదీస్తే.. అందరికి బాండ్లు రాసిచ్చాడు. పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాక పత్తా లేకుండాపోయాడు. రమేశ్ బోర్డు తిప్పేసిన విషయాన్ని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. కుషాయిగూడా పోలీస్‌స్టేషన్‌లో బాధితులంతా ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఛీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మోసంలో సుమారు 1100 మంది బాధితులున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

TV9 , Reporter

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ హెడ్-టు-హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఇల్లే స్వర్గమవుతుంది..
అలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఇల్లే స్వర్గమవుతుంది..
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్!
భారత్‌కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్!
విద్యార్ధులకు పోలీస్‌ హెచ్చరిక.. ఆ కాలేజీల్లో చేరి మోసపోవద్దు!
విద్యార్ధులకు పోలీస్‌ హెచ్చరిక.. ఆ కాలేజీల్లో చేరి మోసపోవద్దు!
ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
శరీరంపై ఈ చోట్ల పుట్టుమచ్చ ఉందా? అయితే అదృష్టం, డబ్బు, విజయం..
శరీరంపై ఈ చోట్ల పుట్టుమచ్చ ఉందా? అయితే అదృష్టం, డబ్బు, విజయం..
దూసుకొస్తున్న వాయుగుండం! తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
దూసుకొస్తున్న వాయుగుండం! తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
బడి పిల్లలకు తప్పిన భారీ ప్రమాదం తప్పింది..!
బడి పిల్లలకు తప్పిన భారీ ప్రమాదం తప్పింది..!
ఐకానిక్ సెలబ్రేషన్ రీక్రియేట్.. ఆ దిగ్గజం గుర్తున్నాడా?
ఐకానిక్ సెలబ్రేషన్ రీక్రియేట్.. ఆ దిగ్గజం గుర్తున్నాడా?
హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం
హోంశాఖలో ఉద్యోగాల జాతర.. 7,437 పోలీస్ కొలువుల భర్తీ కసరత్తు ఆరంభం